Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో : ' భగవంతుడా నీపైనే భారం వేసి బయల్దేరుతున్నాం. ఇక నువ్వే చూసుకోవాలి' అన్నట్టు ఉంది శ్రీలంక క్రికెట్ జట్టు పరిస్థితి. 2009 పాకిస్థాన్ పర్యటనలో లాహౌర్లో శ్రీలంక క్రికెట్ జట్టు బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించి శ్రీలంక క్రికెటర్లను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడేశాడు. ఆ ఘటన జరిగిన పదేండ్ల తర్వాత తొలిసారి శ్రీలంక జట్టు పాకిస్థాన్లో పర్యటించేందుకు సిద్ధమైంది. భద్రతా కారణాల రీత్యా శ్రీలంక స్టార్ ఆటగాళ్లు లసిత్ మలింగ, చండిమాల్, ఎంజెలో మాథ్యూస్ సహా పది మంది పాక్ పర్యటనకు దూరమయ్యారు. దీంతో ద్వితీయ శ్రేణి జట్టును పాక్కు పింపింది శ్రీలంక క్రికెట్ బోర్డు. వన్డే జట్టుకు లహిరు తిరిమానె కెప్టెన్ కాగా, టీ20 జట్టుకు దసున్ శనక నాయకత్వం వహించనున్నాడు. పాకిస్థాన్ పర్యటనకు శ్రీలంక జట్టు మంగళవారం కొలంబో నుంచి బయల్దేరింది. ప్రయాణానికి ముందు శ్రీలంక క్రికెట్ జట్టు ప్రార్థనలు చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.