Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20ల్లో 4 ఓవర్లలో 3 మెయిడెన్లు
సూరత్: భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ టీ20ల్లో రికార్డు నెలకొల్పింది. దక్షిణాఫ్రికా జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఏకంగా మూడు మెయిడిన్ ఓవర్లు వేసి రికార్డుల్లోకి ఎక్కింది. దీంతో టీ20ల్లో మూడు మెయిడిన్ ఓవర్లు వేసిన మొట్టమొదటి భారత క్రికెటర్గా ఖ్యాతిని దక్కించుకుంది. నాలుగు ఓవర్లు వేసి కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించింది. తాను వేసిన 19వ బంతికి మొదటి పరుగు ఇచ్చిదంటే ఆమె బౌలింగ్ ఎంత పొదుపుగా బౌలింగ్ చేసిందో అర్ధమౌతోంది. ఈ ఆగ్రా అమ్మాయి తొలి రెండు మేడిన్ ఓవర్లలో రెండు వికెట్లు తీయడం విశేషం.