Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు రోజుల వార్మప్ మ్యాచ్
నవతెలంగాణ, విజయనగరం
విశాఖ టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా ఓపెనర్ ఎడెన్ మార్క్రామ్ (100 నాటౌట్, 118 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్స్లు) ఫామ్ చాటుకున్నాడు. బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్తో సఫారీ మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో మార్క్రామ్ అజేయ సెంచరీతో రాణించాడు. ఎడతెరపి లేని వర్షంతో తొలి రోజు ఆట రద్దు కాగా.. రెండో రోజు దక్షిణాఫ్రికా టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మరో ఓపెనర్ డీన్ ఎల్గార్ (6), డీ బ్య్రూన్ (6) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. మార్క్రామ్ మెరుగ్గా ఆడాడు. మిడిల్ ఆర్డర్లో తెంబ బవుమా (55 నాటౌట్, 92 బంతుల్లో 9 ఫోర్లు) నుంచి మార్క్రామ్కు చక్కటి సహకారం లభించింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 199/5తో కొనసాగుతోంది. హంజా (22) ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ డుప్లెసిస్ (9)ను స్పిన్నర్ ధర్మేంద్రసిన్హ జడేజా వికెట్ల ముందు అవుట్ చేశాడు. ఉమేశ్ యాదవ్ ఏడు ఓవర్లలో ఓ వికెట్ పడగొట్టగా, జడేజా రెండు వికెట్లతో రాణించాడు. మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో నేడు ఆఖరు రోజు. తొలి సెషన్ తర్వాత దక్షిణాఫ్రికా డిక్లరేషన్ ప్రకటించినా.. భారత స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ ఓపెనర్గా ప్రయోగం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ ప్రదర్శనపై భారత జట్టు ఆసక్తిగా ఎదురుచూస్తోంది.