Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సఫారీ సీమర్ ఫిలాండర్
విజయనగరం : దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజాలు హషీమ్ ఆమ్లా, డెల్ స్టెయిన్ రిటైర్మెంట్ తర్వాత తొలిసారి సఫారీ టెస్టు సవాల్ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. భారత్ను భారత్లో ఎదుర్కొవటం అంత సులవు కాదు. అయినా, టీమ్ ఇండియాకు తొలి పంచ్ విసరాలనే లక్ష్యంతో దక్షిణాఫ్రికా రెఢ అవుతోంది. సీనియర్ క్రికెటర్లు ముందుండి నడిపిస్తే, జూనియర్లు సైతం రెచ్చిపోతారని వెటరన్ సీమర్ ఫిలాండర్ అభిప్రాయపడ్డాడు. ' ఫ్రీడమ్ సిరీస్ కఠినమైన సవాల్. స్టార్ క్రికెటర్లపైనే ఫోకస్ ఉంటుంది. కానీ ఇక్కడ తొలి పంచ్ ఇవ్వటమే మా లక్ష్యం. ప్లేయర్ టు ప్లేయర్ సవాళ్ల నుంచి సిరీస్ లో ఇంకెంతో ఉంది. సఫారీ సిరీస్ను నెమ్మది గా మొదలెడుతుందని నానుడి. కానీ ఈసారి సీనియర్లు జట్టును ముందుండి నడిపించాలి. భారత్కు తొలి పంచ్ సఫారీ ఇవ్వాలి' అని ఫిలాండర్ అన్నాడు. భారత్లో జరిగిన గత ఫ్రీడమ్ సిరీస్లో ఫిలాండర్ 15 వికెట్లు తీశాడు. ఈ సారి యువ సీమర్ కగిసో రబాడ సీమ్ దళంలో ఫిలాండర్ కీలక పాత్ర పోషించనున్నాడు.