Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధోనిపై రాష్ట్రపతి కోవింద్ ప్రశంస
రాంచీ : భారత క్రికెట్ దిగ్గజం, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనిపై భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రశంసలు కురిపించాడు. రాంచీ విశ్వవిద్యాలయం 33వ స్నాతకోత్సవంలో పాల్గొన్న రామ్నాథ్ కోవింద్.. జార్ఖండ్ డైనమైట్ ధోని సహా రాష్ట్ర ఖ్యాతిని పెంచిన క్రీడాకారులను ప్రశంసించాడు. ' రాజ్భవన్లో ఆదివారం ఎం.ఎస్ ధోని నన్ను కలిశారు. మర్యాదపూర్వక భేటికి నేను ఎంతో సంతోషించాను. నువ్వు సాదాసీదాగా ఉంటావు, కానీ నీ పట్ల అభిమానులు సముద్రమంత ప్రేమ చూపిస్తారని నేను ధోనితో అన్నాను. ప్రపంచ క్రికెట్లో రాంచీని పాపులర్ చేసిన ఘనత ఎం.ఎస్ ధోనిదే' అని కోవింద్ విద్యార్థులతో అన్నారు. ఆర్చర్ దీపక కుమారి, 1928 హాకీ గోల్డ్ సాధించిన కెప్టెన్ జైపాల్ సింగ్ ముండాలు రాష్ట్ర ఖ్యాతిని చాటి చెప్పారని కోవింద్ అన్నారు. కార్యక్రమంలో ప్రథమ పౌరురాలు సవితా కోవింద్, జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము, రాంచీ యూనివర్శిటి చాన్సలర్ ఆర్కె పాండే, వీసీ కామిని కుమార్లు పాల్గొన్నారు.