Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉలాన్ ఉదె (రష్యా) : ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్స్లో భారత్కు తీపి కబురు. తొలి రెండు రోజుల నిరాశ అనంతరం 48 కేజీల విభాగంలో మంజు రాణి పంచ్ పవర్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రతిష్టాత్మక వరల్డ్ చాంపియన్షిప్స్ మెడల్కు మంజు రాణి ఇప్పుడు ఓ విజయం దూరంలోనే నిలిచింది. సోమవారం జరిగిన ప్రీ క్వార్టర్స్ రౌండ్లో మంజు రాణి 5-0తో వెనుజులా బాక్సర్ రోజాస్ సెడానోపై తిరుగులేని విజయం సాధించింది. బౌట్లో ఇద్దరు బాక్సర్లు డిఫెన్స్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. డిఫెన్స్లో మంజు రాణి పైచేయి సాధించింది. కొన్ని స్పష్టమైన పంచ్లను ప్రత్యర్థిపైకి విసిరింది. గురువారం జరిగే క్వార్టర్స్ సమరంలో టాప్ సీడ్ కిమ్ హయాంగ్ మి (కొరియా)తో మంజు పోరాడనుంది. 64 కేజీల విభాగంలో మంజు బొంబారియ 1-4తో ఇటలీ బాక్సర్ చేతిలో ఓటమిపాలైంది. ఆరు సార్లు వరల్డ్ చాంపియన్ మేరీకోమ్ (51 కేజీలు) నేడు తొలి పంచ్ విసరనుంది. తొలి రౌండ్లో మేరీకోమ్కు బై లభించింది.