Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆఖరి లీగ్ మ్యాచ్లో యుపిపై టైటాన్స్ గెలుపు
లక్నో: ప్రొ కబడ్డీ సీజన్-7లో తెలుగు టైటాన్స్ ఆఖరి లీగ్ మ్యాచ్ను విజయంతో ముగించింది. బుధవారం యుపి యోథాను 41-36 పాయింట్లతో చిత్తు చేసింది. తెలుగు టైటాన్స్ గెలుపులో సిద్ధార్ద్ దేశారు(15), కృష్ణ, ఫర్హద్ నాలుగేసి పాయింట్లతో కీలకపాత్ర పోషించారు. ట్యాకిల్లో 8 పాయింట్లే సాధించినా... రైడ్లలో 26 పాయింట్లు గెల్చుకోవడం విశేషం. ఇక యుపి రైడ్లద్వారా 19, ట్యాకిల్స్లో 12 పాయింట్లు మాత్రమే గెల్చుకొంది. ఇరుజట్లు నాలుగేసిసార్లు ప్రత్యర్ధి జట్లను ఆలౌట్ కూడా చేసుకోగలిగాయి. ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ 22 మ్యాచ్లు ఆడి కేవలం 6 మ్యాచుల్లో గెలిచి 13 మ్యాచుల్లో పరాజయాన్ని చవిచూసింది. అంతేగాక మరో మూడు మ్యాచులను టై చేసుకొని 45 పాయింట్లతో 11వ స్థానంలో సరిపెట్టుకుంది. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 33-29 పాయింట్లతో తమిళ్ తలైవాస్ను చిత్తుచేయడంతో తమిళ్ జట్టు 37 పాయింట్లతో 12వ(ఆఖరి) స్థానంలో ఉంది.