Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటినుంచి థారులాండ్ బ్యాడ్మింటన్ టోర్నీ
ఓడెన్సె(డెన్మార్క్): థాయ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిల్ ఫేవరేట్లుగా పివి సింధు, సైనా నెహ్వాల్ బరిలోకి దిగనున్నారు. ఆగస్టులో ప్రపంచ బ్యాడ్మింటన్ టైటిల్ను నెగ్గిన సింధు ప్రపంచ ర్యాంకింగ్స్లో 14వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకగా... గాయాల కారణంగా కొంతకాలం విశ్రాంతి అనంతరం బరిలోకి దిగిన సైనా నెహ్వాల్ 23వ ర్యాంక్తో రంగంలోకి దిగి అద్భుత ప్రదర్శనతో 8వ ర్యాంక్కు ఎగబాకింది. ఇక పురుషుల సింగిల్స్లో మాత్రం ఈ ఏడాది టోర్నీల్లో నిరాశపర్చిన కిదాంబి శ్రీకాంత్ ఏకంగా 17వ ర్యాంక్కు పడిపోయాడు. ఇక సాయి ప్రణీత్(13), పారుపల్లి కశ్యప్(15) స్థానాల్లో నిలిచారు. దీంతో మంగళవారంనుండి ప్రారంభం కానున్న థారులాండ్ ఓపెన్లో సత్తా చాటి ఈ ఏడాది ఆఖరు నాటికి ర్యాంకింగ్స్ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిపక్షంలో వచ్చే ఏడాదిలో జరిగే మేజర్ టోర్నీలో నేరుగా పాల్గొనే అర్హతను కోల్పోతారు. నేటినుంచి ప్రారంభం కానున్న థారులాండ్ ఓపెన్ తొలిరౌండ్ పోటీలో పారుపల్లి కశ్యప్ థారులాండ్కు చెందిన థామస్సిన్తో... కిదాంబి శ్రీకాంత్, డెన్మార్క్కు చెందిన 4వ సీడ్ ఆంటోన్సెతో తలపడనున్నారు. ఇక మహిళల సింగిల్స్లో 8వ సీడ్ సైనా నెహ్వాల్ అన్సీడెడ్ టకహసి(జపాన్)తో, 5వ సీడ్ పివి సింధు అన్సీడెడ్ టంగ్జంగ్(ఇండోనేషియా)తో తలపడనున్నారు.