Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు హాకీ క్రీడాకారుల మృతి
భోపాల్ : మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు జాతీయ స్థాయి హాకీ క్రీడాకారులు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. తమ స్నేహితుల పుట్టినరోజు పార్టీకి హాజరైన వీరందరూ ఇటార్సీ నుండి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హోషంగాబాద్లో జరుగుతున్న ధ్యాన్చంద్ ట్రోఫీ మ్యాచ్లో సోమవారం వారు పాల్గొనాల్సి వుంది. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో జాతీయ రహదారి 69కి సమీపంలోని రైసల్పూర్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వేగంగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించే యత్నంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని, దీంతో కారు చెట్టును ఢ కొట్టి, బోల్తా పడిందని ఉన్నతాధికారి తెలిపారు. 18 నుండి 22 ఏళ్లలోపు వారైన హహనాజ్ హుస్సేన్ (ఇండోర్), ఆదర్ష్ హర్దువా (ఇటార్సీ), ఆశిష్లాల్ (జబల్పూర్), అనికేత్ వరుణ్ (గ్వాలియర్)లు మృతిచెందినట్లుగా గుర్తించారు. షాన్ గ్లాడ్విన్ (ఇటరాసి), సాహిల్ చౌరే(ఇటార్సీ), అక్షరు అవస్థీ (గ్వాలియర్)లు గాయపడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వీరంతా భోపాల్లోని ఎంపి హాకీ అకాడమీకి చెందిన వారు. కాగా, వీరి మృతిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ విచారం వ్యక్తం చేశారు.