Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింధు ముందుకు... కశ్యప్, సమీర్ ఔట్
- థాయ్ లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
ఓడెన్సె(డెన్మార్క్): థాయ్ లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సాయి ప్రణీత్ సంచలన విజయాన్ని నమోదు చేసుకొన్నాడు. మంగళవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో చైనాకు చెందిన మాజీ టాప్సీడ్ ఆటగాడు లిన్డాన్ను వరుస సెట్లలో చిత్తుచేశాడు. సాయి ప్రణీత్ 21-14, 21-17 పాయింట్ల తేడాతో లిన్ డాన్పై గెలిచాడు. ఇతర పోటీల్లో సమీర్వర్మ, పారుపల్లి కశ్యప్ తొలిరౌండ్ పోటీల్లోనే పరాజయాలను చవిచూశాడు. సమీర్ వర్మ 21-19, 11-21, 17-21 పాయింట్ల తేడాతో కల్జోవ్(నెదర్లాండ్) చేతిలో... కశ్యప్ 13-21, 12-21 పాయింట్ల తేడాతో థాయ్ లాండ్కు చెందిన థమ్మసిన్ చేతిలో ఓడారు. మహిళల సింగిల్స్లో పివి సింధు 22-20, 21-18 పాయింట్ల తేడాతో టంగ్జంగ్(ఇండోనేషియా)ను చిత్తుచేసి రెండోరౌండ్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ 24-22, 21-11 పాయింట్ల తేడాతో కొరియాకు చెందిన కిమ్-లీపై చెమటోడ్చి నెగ్గారు.