Authorization
Mon Jan 19, 2015 06:51 pm
థింపు(బూటాన్): దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య(శాఫ్) మహిళల చాంపియన్షిప్ టైటిల్ను భారత్ గెల్చుకుంది. శుక్రవారం భూటాన్లో జరిగిన ఫైనల్లో 5-3 గోల్స్ తేడాతో బంగ్లాదేశ్పై టైబ్రేక్లో విజయం సాధించింది. భారత్ తరఫున షెల్లీదేవి, నిషా, పూర్ణిమ కుమారి, అమీషా, బబినా దేవి గోల్ చేయడంలో సఫలీకృతమయ్యారు. బంగ్లా జట్టు తరఫున నస్రీన్, సప్నా రాణి, రూమీ అక్తర్ తలా ఓ గోల్ సాధించారు. లీగ్లో నేపాల్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 4-1తో గెలిచింది. రెండో మ్యాచ్లో భారత్ 10-1తో భూటాన్ను చిత్తుగా ఓడించింది. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మూడో లీగ్మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ఇక ఫైనల్లో భారత మహిళలు టైబ్రేక్లో బంగ్లాను ఓడించి టైటిల్ను చేజిక్కించుకోవడం విశేషం. భారత జట్టుకు హైదరాబాద్కు చెందిన మాజీ అంతర్జాతీయ క్రీడాకారుడు, ఎస్బీఐ జట్టు ఫుట్బాల్ కోచ్ జిపి ఫల్గుణ డిప్యూటీ మేనేజర్గా వ్యవహరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫుట్బాల్ సంఘం అధ్యక్షుడు మొహమ్మద్ అలీ రఫత్ విజేతగా నిలిచిన భారత జట్టును అభినందించారు.