Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో బ్రిటన్ చేతిలో 2-1తో పరాజయం
- సుల్తాన్ జోహొర్ కప్
జోహోర్బహ్రు(మలేషియా)
సుల్తాన్ జోహోర్కప్ ఫైనల్లో భారత జూనియర్ జట్టు పరాజయాన్ని చవిచూసింది. శనివారం గ్రేట్ బ్రిటన్తో జరిగిన ఫైనల్ పోటీలో భారత్ 1-2 గోల్స్ తేడాతో ఓటమి పాలైంది. తొలి మూడు క్వార్టర్ల వరకూ ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. నాల్గో క్వార్టర్ 49వ నిమిషంలో సింగ్ గుర్షాహిబ్జిత్ గోల్ చేయడంతో భారత్ 1-0 ఆధిక్యత సంపాదించింది. ఆ వెంటనే బ్రిటన్ తరఫున 50వ నిమిషంలో స్టువర్ట్ గోల్ చేయడంలో ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. మ్యాచ్ మరి కొద్ది సెకన్లలో ముగుస్తుందనగా స్టువర్ట్ మరో గోల్ చేయడంతో బ్రిటన్ 2-1 గోల్స్తో విజేతగా నిలిచింది. ఆతిథ్య మలేషియా 3-2 గోల్స్తో జపాన్ను ఓడించడం ద్వారా మూడు, నాలుగు స్థానాల్లో నిలవగా.. ఐదు, ఆరు స్థానాలకు జరిగిన మరో పోటీలో ఆస్ట్రేలియా 4-2 గోల్స్తో న్యూజిలాండ్ను ఓడించింది. శుక్రవారం భారత్-బ్రిటన్ జట్ల మధ్య జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ 3-3 గోల్స్తో డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.