Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరాశపర్చిన కోహ్లీ, పుజరా - భారత్ 224/3
టీమిండియా 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో రోహిత్, రహానేలు ఆదుకున్నారు. రోహిత్(117), రహానే(83) నిలకడగా ఆడి నాల్గో వికెట్కు ఇప్పటికే 185 పరుగులు జతచేశారు. వెలుతురు లేమి అనంతరం వర్షం కురవడంతో ఆటను 32 ఓవర్లల ముందే నిలిపివేశారు. ఈ మ్యాచ్లో రోహిత్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సిక్సర్లు(16) కొట్టిన బ్యాట్స్మన్గా రోహిత్కొట్టి రికార్డులకెక్కాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ ఆటగాడు హెట్మెయిర్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. 2018-19లో బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో హెట్మెయిర్ 15 సిక్సర్లు కొట్టాడు. దాన్ని రోహిత్ బద్దలు కొట్టాడు.
రాంచీ: దక్షిణాఫ్రికాతో ఇక్కడ ప్రారంభమైన మూడో టెస్ట్లో భారత్ తొలిరోజు మూడు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేయగల్గింది. కోహ్లీ(12), పుజరా(0) ఘోరంగా విఫలమవ్వగా... ఓపెనర్ రోహిత్ శర్మ(117 నాటౌట్), రహానే(83 నాటౌట్) స్ఫూర్తిదాయకంగా ఆటడంతో తొలిరోజు భారత్ నిలదొక్కుకుంది. అంతేగాక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మూడో సిక్సర్ బాదడం ద్వారా ఓ టెస్ట్ సిరీస్లో (16వ సిక్సర్లు) అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు పుటల్లోకెల్లాక్కాడు. భారతజట్టు 12 పరుగుల వద్ద అగర్వాల్(10) వికెట్ను కోల్పోయింది. విశాఖ టెస్ట్లో డబుల్ సెంచరీతో కదం తొక్కిన అగర్వాల్ మళ్లీ నిరాశపరిచాడు. రబడా వేసిన బంతిని ఆడే క్రమంలో ఫస్ట్ స్లిప్లో ఉన్న ఎల్గర్కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్కు చేరాడు. ఆ తర్వాత పుజరా డకౌటయ్యాడు. దక్షిణాఫ్రికా పేసర్ నార్జీ వేసిన బంతికి కోహ్లి వికెట్లు ముందు దొరికిపోయాడు. ఆ తరుణంలో రోహిత్ వైస్ కెప్టెన్ రహానేతో కలిసి ఇన్నింగ్స్ను చక్కబెట్టాడు. ఈ క్రమంలోనే తొలుత అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. ఆ తర్వాత వేగం పెంచాడు. వన్డే తరహాలో బౌండరీల మోత మోగించాడు. మరొకవైపు రహానే కూడా అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రహానే నుంచి చక్కటి సహకారం లభించడంతో రోహిత్ రెచ్చిపోయి ఆడాడు. దాంతో త్వరగా సెంచరీ మార్కును చేరాడు. ఆ తర్వాత రహానే కూడా మెల్లగా శతకానికి దగ్గరయ్యాడు. ఈ తరుణంలో వెలుతురు లేమి, వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. రబడాకు రెండు, నూర్జికు ఒక వికెట్ దక్కాయి.
వెలుతురులేమితో ముందే నిలిచిన ఆట
మూడు వికెట్లు కోల్పోయిన భారతజట్టును రోహిత్, రహానేలు ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 185 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఆ తర్వాత వెలుతురులేమి కారణంగా మ్యాచ్ను నిలిపివేశారు. ఇక మ్యాచ్ తిరిగి కొనసాగించేందుకు వాతావరణం అనుకూలించే అవకాశం లేకపోవడంతో ఈరోజు ఆటను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. శనివారం కేవలం 58 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మరో 32 ఓవర్లు ఆడాల్సి ఉన్నప్పటికీ వెలుతురులేమి అడ్డుకుంది. టీ విరామానికి వెళ్లి వచ్చిన కాసేపటికి ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఆపై వర్షం కూడా పడటంతో తొలిరోజు మిగిలి ఉన్న ఆటను రద్దు చేశారు. ఆట ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(117 బ్యాటింగ్; 164 బంతుల్లో 14 ఫోర్లు, 4సిక్సర్లు), రహానే(83 బ్యాటింగ్; 135 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్)లు క్రీజ్లో ఉన్నారు.
అత్యధిక సిక్సర్లతో రోహిత్ రికార్డు
దక్షిణాఫ్రికాతో తొలిటెస్టులో వరుస ఇన్నింగ్స్ల్లో సెంచరీలు సాధించి టెస్టు ఓపెనర్గా అరంగేట్రం చేసిన మ్యాచ్లోనే ఈ ఫీట్ సాధించిన ఏకైక బ్యాట్స్మన్గా కొత్త అధ్యాయాన్ని లిఖించిన టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ.. మూడో టెస్టులో మరొక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మన్గా రోహిత్ రికార్డులకెక్కాడు. మూడో టెస్టులో మూడో సిక్సర్ కొట్టిన తర్వాత ఈ ఫీట్ను రోహిత్ తన పేర లిఖించుకున్నాడు. ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సిక్సర్లు(16) కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ ఆటగాడు హెట్మెయిర్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. 2018-19 సీజన్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లో హెట్మెయిర్ 15 సిక్సర్లు కొట్టాడు. దాన్ని రోహిత్ తాజా బద్ధలు కొట్టాడు.
అంతేగాక భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది. 2010-11 సీజన్లో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో హర్భజన్ సింగ్ 14 సిక్సర్లు కొట్టాడు. ఇదే ఒక్క టెస్టు సిరీస్లో భారత్ తరఫున ఇప్పటివరకూ అత్యధిక వ్యక్తిగత సిక్సర్ల రికార్డు. దాన్ని కూడా సవరించాడు రోహిత్. ఈ మ్యాచ్లో రోహిత్ 130 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్లతో శతకం సాధించాడు. సిక్సర్తో సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఇది రోహిత్కు టెస్టుల్లో 6వ సెంచరీ కాగా, ఈ సిరీస్లో మూడో శతకం. అదే సమయంలో టెస్టుల్లో రెండు వేల పరుగుల్ని రోహిత్ పూర్తి చేసుకున్నాడు. ఇది రోహిత్కు 30వ టెస్టు.
స్కోర్బోర్డు...
భారత్ తొలి ఇన్నింగ్స్: అగర్వాల్ (సి) ఎల్గర్ (బి) రబడా 10, రోహిత్ (బ్యాటింగ్) 117, ఛటేశ్వర పుజరా (ఎల్బి) రబడా 0, విరాట్ కోహ్లీ (ఎల్బి) నూర్జి 12, రహానె (బ్యాటింగ్) 83, అదనం 2. (58 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) 224 పరుగులు.
వికెట్ల పతనం: 1/12, 2/16, 3/39
బౌలింగ్: రబడా 14-5-54-2, ఎన్గిడి 11-4-36-0, నూర్జి 16-3-50-1, జార్జి లిండే 11-1-40-0, పిడిట్ 6-0-43-0