Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా ఓపెన్ బ్యాడ్మింటన్
ఫుజౌ (చైనా) : ప్రతిష్టాత్మక చైనా ఓపెన్లో భారత సింగిల్స్ స్టార్స్ నిరాశపరిచినా.. డబుల్స్లో సాత్విక్ జోడీ మాత్రం అంచనాలను నిలబెట్టుకునే పనిలో నిమగమైంది. చైనా ఓపెన్లో సాత్విక్సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్లో సాత్విక్, చిరాగ్ శెట్టి జంట 21-18, 21-23, 21-11తో మూడు గేముల పాటు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో పైచేయి సాధించారు. జపాన్ జోడీ హిరోయుకి ఎండో, యుట వాటాంబెలపై సాత్విక్, చిరాగ్ జోడీకి ఇది వరుసగా రెండో విజయం. తొలి గేమ్ను మంచి తేడాతో నెగ్గిన సాత్విక్ జోడీ.. రెండో గేమ్ను టైబ్రేకర్లో కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్లో భారత జోడీ చెలరేగింది. జపాన్ ద్వయాన్ని చిత్తు చేసి అలవోకగా మూడో గేమ్ను, క్వార్టర్స్ బెర్త్ను దక్కించుకుంది. నేడు సెమీస్ బెర్త్ కోసం చైనా షట్లర్లు లి జన్ హురు, లి యు చెన్లతో సాత్విక్, చిరాగ్ పోటీపడనున్నారు. అక్టోబర్లో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్కు చేరిన సాత్విక్, చిరాగ్.. ఆగస్టులో థారులాండ్ ఓపెన్ విజేతలుగా అవతరించిన సంగతి తెలిసిందే.