Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒత్తిడిలో సైనా, పి.వి సింధు నేటి నుంచి హాంగ్కాంగ్ ఓపెన్
హాంగ్కాంగ్ : భారత బ్యాడ్మింటన్ ఇటీవల భిన్నమైన హిట్ ఫార్ములాతో వార్తల్లోకి ఎక్కుతోంది. ఇప్పటివరకూ భారత్ చారిత్రక విజయాలు ఎక్కువగా సింగిల్స్లోనే వచ్చాయి. కానీ ఇటీవల సంచలన డబుల్స్ జోడీ సాత్విక ్సాయి రాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ సర్క్యూట్లో అప్రతిహాత విజయాలు సాధిస్తున్నారు. నిలకడగా ప్రపంచ అగ్రశ్రేణి షట్లర్లను మట్టి కరిపిస్తున్నారు. చైనా ఓపెన్లో సెమీఫైనల్స్కు చేరిన సాత్విక్, చిరాగ్ నేటి నుంచి ఆరంభం కానున్న హాంగ్కాంగ్ ఓపెన్లో టైటిల్పై గురి పెట్టారు. హాంగ్కాంగ్ ఓపెన్లో సాత్విక్, చిరాగ్ జంటపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. సింగిల్స్లో ఆరో సీడ్ పి.వి సింధు, సైనా నెహ్వాల్లు మరో ఆరంభ పరాభవానికి గురి కాకూడదనే సంకల్పంతో కనిపిస్తున్నారు. మహిళల సింగిల్స్లో సింధు తొలి రౌండ్లో కొరియా అమ్మాయి కిమ్ గా ఎన్ తో తల పడనుంది. చైనా ఓపెన్లో తనను ఓడించిన డ్రాగన్ షట్లర్ కారు యన్ యాన్తోనే సైనా నెహ్వాల్ హాంగ్కాంగ్లో తొలి పోరు చేయనుంది. పురు షుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లో వరల్డ్ నం.1 కెంటో మో మోటతో తలపడనున్నాడు. సమీర్ వర్మ, పారుపల్లి కశ్యప్, బి. సారు ప్రణీత్ సైతం రేసులో ఉన్నారు. మహిళల డబుల్స్లో సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప మెరుగైన విజయం కోసం ఎదురుచూస్తున్నారు.