Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
హాంకాంగ్: ప్రపంచ ఛాంపియన్ పివి సింధు తొలిరౌండ్ గండాన్ని దాటింది. బుధవారం జరిగిన హాంకాంగ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్-500 టోర్నీ మహిళల సింగిల్స్ తొలిరౌండ్ పోరులో సింధు 21-15, 21-16తో 19వ ర్యాంకర్ కిమ్-గా-ఉన్(దక్షిణ కొరియా)పై వరుస సెట్లలో విజయాన్ని నమోదు చేసుకుంది. కేవలం 36 నిమిషాల్లో వీరిద్దరి ఆట ముగిసింది. సింధు రెండోరౌండ్లో థారులాండ్ షట్లర్ బుసానన్తో తలపడనుంది. ఇక సైనా నెహ్వాల్ 13-21, 20-22 పాయింట్ల తేడాతో చైనాకు చెందిన క్యా-యన్-యన్ చేతిలో పరాజయాన్ని చూవిచూసింది. ఇక పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మ 11-21, 21-13, 8-21 పాయింట్ల తేడాతో వాంగ్-జు-వురు(చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడాడు. హెచ్ఎస్ ప్రణరు రారు 21-17, 21-17 పాయింట్ల తేడాతో హుయాంగ్-యు-జింగ్ను చిత్తుచేసి రెండోరౌండ్లోకి ప్రవేశించగా... బి. సాయి ప్రణీత్ 21-11, 18-21, 12-21తో మూడో సీడ్ చైనాకు చెందిన షి-యుకీ చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. కిదాంబి శ్రీకాంత్కు తొలిరౌండ్లో వాకోవర్ లభించింది. టాప్సీడ్ కెంటో మొమొటో(జపాన్) టోర్నీనుంచి వైదొలగడంతో శ్రీకాంత్ రెండోరౌండ్లోకి ప్రవేశించాడు. అర్హత మ్యాచ్లు ఆడి ప్రధాన టోర్నీలోకి ప్రవేశించిన సౌరభ్ వర్మ తొలిరౌండ్ పోటీలో 21-11, 21-15తో లెవెర్డెజ్(ఫ్రాన్స్)ను చిత్తుచేయడం గమనార్హం. మహిళల డబుల్స్ తొలిరౌండ్ పోటీలో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి జోడీ 13-21, 12-21తో ఇంగ్లండ్ షట్లర్ల చేతిలో ఓడారు.