Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరాచీ: పదేండ్ల తర్వాత పాకిస్తాన్లో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. కొద్దిరోజుల క్రితం శ్రీలంక టీ20 సిరీస్ ఆడటానికి పాక్లో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనకు శ్రీలంక స్టార్, సీనియర్ క్రికెటర్లు దాదాపు పది మంది దూరమైనప్పటికీ 'జూనియర్ జట్టు'నే అక్కడికి పంపించగా... ఆ పర్యటన విజయవంతమైంది. ఈ నేపథ్యంలో పాక్లో టెస్టు సిరీస్ ఆడటానికి శ్రీలంక సమాయత్తమైంది. ఐసీసీ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా పాక్లో శ్రీలంక టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. దాంతో పాక్లో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా స్పష్టం చేసింది. ఇరుజట్ల మధ్య జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా డిసెంబర్ 11 నుంచి 15 వరకూ రావల్పిండిలో తొలి టెస్టు జరుగనుండగా, డిసెంబర్ 19నుంచి 23 వరకూ కరాచీలో రెండో టెస్టు జరగనుంది.