Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11వ స్థానంలో మయాంక్ ఆగర్వాల్
దుబాయ్: టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పేసర్ మహమ్మద్ షమీ తన టెస్టు కెరీర్లో అత్యుత్తమ ర్యాంకునకు చేరుకున్నాడు. ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ఆదివారం ప్రకటించిన ర్యాంకింగ్స్లో షమీ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. టెస్టుల్లో 790 రేటింగ్ పాయింట్లతో షమీ ఏడో స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్తో టెస్టు మ్యాచ్లో 243 పరుగులతో మయాంక్ వీర విహారం చేయడంతో.. 691 పాయింట్లతో 11వ ర్యాంక్ దక్కించుకున్నాడు. మయాంక్, షమీ ఇద్దరికీ ఇవి కెరీర్ అత్యుత్తమ ర్యాంకులు కావడం విశేషం. అలాగే భారత్ తరఫున ఐసీసీ ర్యాంకింగ్స్లో అత్యధిక పాయింట్స్ సాధించిన మూడో బౌలర్గా షమీ రికార్డు సృష్టించాడు. షమీ కంటే ముందు స్థానాల్లో కపిల్దేవ్(877), జస్ప్రీత్ బుమ్రా(832) ఉన్నారు. టెస్టు ర్యాంకింగ్స్లో భారత్ నుంచి యువ స్పీడ్స్టర్ బుమ్రా 802 పాయింట్లతో నాలుడో ర్యాంకులో కొనసాగుతుండగా.. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 780 రేటింగ్స్తో పదో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ నంబర్ వన్లో ఉండగా.. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు.