Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాసియా క్రీడల్లో భారత్ హవా
ఖాట్మాండు (నేపాల్) : దక్షిణాసియా క్రీడల్లో టీమ్ ఇండియా సత్తా చాటుతోంది. మంగళవారం ఇక్కడి జరిగిన 13వ దక్షిణాసియా క్రీడల్లో భారత్ పతకాల పంట పండించింది. ట్రాక్ అండ్ ఫీల్డ్లో భారత్ పది పతకాలు కైవసం చేసుకుంది. మూడు స్వర్ణాలు సహా పది పతకాలు సాధించింది. మహిళల 100 మీటర్ల పరుగులో అర్చన, మహిళల హైజంప్లో ఎం. జోష్న, మెన్స్ హై జంప్లో సర్వేశ్ అనిల్ కుశారె, మెన్స్ 1500 మీటర్ల పరుగులో అజరు కుమార్ సరోజ్లు స్వర్ణ పతకాలు సాధించారు. షూటింగ్లో భారత్ క్లీన్స్వీప్ చేసింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత అమ్మాయిలు మూడు పతకాలు కొల్లగొట్టారు. మెహుల్ ఘోష్, శ్రియాంక, శ్రేయ అగర్వాల్లు వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించారు.