Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప్పల్లో వెస్టిండీస్ క్రికెటర్ల ప్రాక్టీస్
నవ తెలంగాణ-హైదరాబాద్ : భాగ్య నగరంలో క్రికెట్ సందడి మొదైలంది. ఈ శుక్రవారం ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్లు తొలి టీ20లో తలపడనున్నాయి. పొట్టి సిరీస్ ఆరంభ మ్యాచ్ కోసం వెస్టిండీస్ జట్టు సోమవారమే హైదరాబాద్కు చేరుకుంది. మంగళవారం కోహ్లిసేన నగరంలోకి అడుగుపెట్టింది. మంగళవారం వెస్టిండీస్ ఉప్పల్లో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నది. కెప్టెన్ కీరన్ పొలార్డ్ సహా ఆటగాళ్లు అందరూ ప్రాక్టీస్ సెషన్కు హాజరయ్యారు. నెట్స్లో, స్టేడియంలోనూ విండీస్ క్రికెటర్లు సాధన చేశారు. నేడు, రేపు సైతం భారత్, వెస్టిండీస్ క్రికెటర్ల ప్రాక్టీస్ కొనసాగనుంది. ఉదయం సెషన్లో విండీస్ క్రికెటర్లు ప్రాక్టీస్ చేయనుండగా.. మధ్యాహ్నాం సెషన్లో భారత క్రికెటర్లు రానున్నారు.