Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ
కోల్కత : దిగ్గజ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ ఎం.ఎస్ ధోని ఎప్పుడు రిటైర్ అయినా, అతడి స్థానం భర్తీ చేసేందుకు యువ ఆటగాడు రిషబ్ పంత్ ముందుంటాడని భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ధోని వారసుడిగా పేరొచ్చిన పంత్కు సెలక్షన్ కమిటీ, జట్టు మేనేజ్మెంట్ ఉదారంగా అవకాశాలు కల్పిస్తోంది. టెస్టుల్లో మెరిసినా.. వన్డే, టీ20ల్లో పంత్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. పేలవ ప్రదర్శనలతో వరుసగా విమర్శకుల దృష్టిలో పడుతున్నాడు. రిషబ్ పంత్ విమర్శలపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. ' ఇది సెలక్షన్ కమిటీ చర్చించాల్సిన అంశం. కానీ రిషబ్ పంత్ ప్రత్యేకమైన ప్రతిభావంతుడు. వెస్టిండీస్పై రెండు మ్యాచుల్లో పంత్ ఎలా ఆడాడో చూశాం. టెస్టుల్లో పంత్ రికార్డు గొప్పగా ఉంది. అంతిమంగా ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది సెలక్షన్ కమిటీ. అది వారికే వదిలేద్దాం' అని గంగూలీ అన్నాడు.