Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో రెండో ఓపెనర్ ఎంపిక భారత్కు తీయని తలనొప్పేనని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ అన్నారు. శ్రీలంకపై 2-0తో టీ20 సిరీస్ సాధించిన టీమ్ ఇండియా, మంగళవారం వాంఖడెలో ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో తలపడనుంది. ఆదివారం మీడియాతో మాట్లాడిన విక్రమ్ రాథోర్ భారత ఓపెనింగ్ ఎంపికపై స్పందించాడు. ' ఇది మంచి డైలామా. తొలి ఓపెనర్గా రోహిత్ శర్మ కచ్చితమైన ఎంపిక. ధావన్, రాహుల్ ఇద్దరూ బాగా ఆడుతున్నారు. వన్డేల్లో ధావన్ మంచి రికార్డు కలిగి ఉన్నాడు. రాహుల్ మంచి ఫామ్లో ఉన్నాడు. మ్యాచ్కు ముందు దీనిపై తుది నిర్ణయం ఉంటుంది. మ్యాచ్కు ఇంకా రెండు రోజుల సమయం ఉంది. జట్టు మేనేజ్మెంట్ కూర్చోని ఇద్దరిలో ఎవరితో వెళ్లాలనే విషయం తేల్చుతుంది' అని విక్రమ్ రాథోర్ తెలిపారు.