Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూనమ్ యాదవ్కు ప్రతిష్టాత్మక అవార్డు
- బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రదానం
ముంబయి : భారత స్టార్ పేసర్, యార్కర్ల హీరో జశ్ప్రీత్ బుమ్రా ప్రతిష్టాత్మక పురస్కారం దక్కించుకున్నాడు. టెస్టు క్రికెట్లో అరంగ్రేటం చేసిన రెండేండ్లలోనే బుమ్రా తనదైన ముద్ర చూపించాడు. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్లలో ఐదు వికెట్ల ప్రదర్శనలు చేసిన ఏకైక ఆసియా బౌలర్గా రికార్డు సృష్టించాడు. 12 టెస్టుల్లో 62 వికెట్లు కూల్చిన బుమ్రా భారత టెస్టు విజయాల్లో బహుముఖ పాత్ర పోషించాడు. టెస్టు, వన్డే, టీ20ల్లో భారత టాప్ వికెట్ టేకర్గా నిలిచిన జశ్ప్రీత్ బుమ్రా బీసీసీఐ ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రిగర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది అత్యుత్తమ భారత క్రికెటర్గా బుమ్రా ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ ఈ ఏడాది అత్యుత్తమ భారత క్రికెటర్ (మహిళలు) అవార్డు దక్కించుకుంది. కష్టమాచారి శ్రీకాంత్ సికె నాయుడు జీవన కాల సాఫల్య పురస్కారం, అంజుమ్ చొప్రా బీసీసీఐ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కించుకున్నారు. దిలిపి దోషి బీసీసీఐ ప్రత్యేక పురస్కారం అందుకుంది. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన చటేశ్వర్ పుజార, అత్యధిక వికెట్లు కూల్చిన జశ్ప్రీత్ బుమ్రాలు దిలిప్ సర్దేశారు అవార్డులు సాధించారు. మహిళల క్రికెట్లో స్మృతీ మంధాన, జులన్ గోస్వామిలు ఈ అవార్డులు దక్కించుకున్నారు. ఉత్తమ అరంగ్రేట క్రికెటర్లు అవార్డులను మయాంక్ అగర్వాల్, సఫాలీ వర్మలు చేజిక్కించుకున్నారు. దేశవాళీ క్రికెట్లో రాణించిన శివం దూబె, నితీశ్ రానా లాలా అమర్నాథ్ పురస్కారాలు సాధించారు. దేశవాళీలో ఉత్తమ ప్రదర్శన చేసిన జట్టుగా విదర్భ నిలిచింది. బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రదాన వేడుక ఆదివారం ముంబయిలో జరిగింది. భారత మాజీ విధ్వంసక ఓపెనర్ వీరెందర్ సెహ్వాగ్ 7వ పటౌడీ స్మారక ఉపన్యాసం చేశారు!. కార్యక్రమానికి భారత మెన్స్, ఉమెన్స్ జట్ల క్రికెటర్లు, బీసీసీఐ ఉన్నతాధికారులు హాజరయ్యారు.