Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తులు ఆహ్వానించిన బీసీసీఐ
నవతెలంగాణ, ముంబయి : సీనియర్ సెలక్షన్ కమిటీ సారథిగా నిత్యం విమర్శలు ఎదుర్కొన్న ఎమ్మెస్కే ప్రసాద్ పదవీకాలం అది కారికంగా ముగిసింది. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇదే ప్రసాద్ ఆఖరు సమావేశం అంటూ ఉన్నారు, ఎమ్మెస్కే ఈ వారంలో సైతం న్యూజిలాండ్ పర్యటనకు భారత జట్టును ఎంపిక చేశాడు. క్రికెట్ సలహా మండలి (సీఏసీ) ఏర్పా టులో జాప్యంతో జాతీయ సెలక్టర్ల ఎంపిక ఆలస్యమైంది. సీఏసీ సభ్యు లుగా గౌతం గంభీర్, మదన్లాల్ పేర్లను బోర్డు సిరీయస్గా పరిశీలి స్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ సెలక్షన్ కమిటీ, సీనియర్ సెలక్షన్ కమిటీ ఫర్ ఉమెన్, జూనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుల కోసం బీసీసీఐ శనివారం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి, అర్హతలు కలిగిన మాజీ క్రికెటర్లు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. సీనియర్ సెలక్షన్ కమిటీలో ప్రసాద్, గగన్లు పదవీ కాలం ముగించుకున్నారు. ఈ ఇద్దరి స్థానాల కోసం బీసీసీఐ దరఖా స్తులు ఆహ్వానిస్తోంది. ఏడు టెస్టులు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచులు లేదా 10 వన్డేలు, 20 ఫస్ల్ క్లాస్ మ్యాచుల అనుభవం కచ్చితంగా కలిగి ఉండాలని పేర్కొంది. ప్రొఫెషనల్ కెరీర్కు వీడ్కోలు పలికి ఐదేండ్ల దాటిన వారు మాత్రమే సెలక్షన్ కమిటీలో సభ్యులుగా పనిచేసేందుకు అర్హులు. మహిళల సీనియర్ సెలక్షన్ కమిటీలో ఐదుగురు కోసం ప్రకటన విడుదల చేశారు. భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వారు మహిళా సెలక్షన్ కమిటీలో సభ్యులుగా అర్హులు. జూనియర్ సెలక్షన్ కమిటీ లోనూ ఐదుగురు సభ్యులను నియ మించనున్నారు. ఆసక్తి కలిగినవారు జనవరి 24 లోపు బీసీసీఐకి దరఖా స్తులు పంపించాలి. దరఖాస్తులు పరిశీలించిన అనంతరం క్రికెట్ సలహా మండలి (సీఏసీ) బోర్డుకు సెలక్టర్ల ప్రాధాన్య క్రమాన్ని బోర్డుకు సిఫారసు చేయనుంది.