Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్క్రెస్ట్చర్చ్: అనధికారిక మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్ 'ఏ' తో జరిగిన ఉత్కంఠ పోరులో యువ భారత్ 5 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1తో కివీస్ కైవసం చేసుకుంది. కివీస్ జట్టు నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది.
లక్ష్య ఛేదనలో ఇషాన్ కిషన్ (84 బంతుల్లో 71, 8ఫోర్లు) చివరి వరకు క్రీజులో ఉన్నా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. పృథ్వీ షా (38 బంతుల్లో 55, 8ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీ సాధించగా.. రుతురాజ్ గైక్వాడ్ (44), అక్షర్పటేల్ (32)లు పర్వాలేదనిపించారు. అయితే సారథి మయాంక్ అగర్వాల్ (24)తో పాటు సూర్యకుమార్ యాదవ్ (5), విజరు శంకర్(19), కృనాల్ పాండ్యా (7)లు పూర్తిగా నిరాశపరిచారు. కైల్ జేమ్సన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. అజాజ్ పటేల్ మూడు, రవీంద్ర రెండు వికెట్లు పడగొట్టి కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. భారత బౌలర్ల ధాటికి కివీస్ ఓ క్రమంలో 105 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో మార్క్ చాప్మన్ (98 బంతుల్లో 110 పరుగులు, 10 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో అదరగొట్టాడు. చాప్మన్కు తోడు లోయరార్డర్ బ్యాట్స్మన్ ఆస్టల్ (65 బంతుల్లో 56, 2ఫోర్లు, 1 సిక్సర్) ఆర్థసెంచరీతో రాణించాడు. వీరిద్దరు ఏడో వికెట్కు 136 పరుగులు నమోదు చేశారు. భారత బౌలర్లలో ఇషాన్ పోరెల్ మూడు వికెట్లతో రాణించగా.. రాహుల్ చహర్ రెండు, సందీప్ వారియర్, అక్షర్ పటేల్లు తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లో తొలి వన్డేలో విశ్వరూపం ప్రదర్శించిన భారత ఆటగాళ్లు.. అదే జోరును తర్వాతి రెండు వన్డేల్లో కొనసాగించలేక సిరీస్ను చేజార్చుకున్నారు.