Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జాతీయ క్రీడా సమాఖ్యలకు (ఎన్ఎస్ఎఫ్)లకు ఎటువంటి నిధుల కొరత ఉండబోదని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. కేంద్ర బడ్జెట్లో క్రీడలకు స్వల్పంగా కేటాయింపులు పెరిగినా జాతీయ క్రీడా సమాఖ్యలు, క్రీడాకారుల ప్రోత్సాహక నిధి, జాతీయ క్రీడాభివృద్ది నిధులకు భారీ కోత విధించారు. ఒలింపిక్స్ ఏడాదిలో కీలక విభాగాలకు నిధుల కోతపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. క్రీడా సమాఖ్యలకు రూ. 300.85 కోట్ల నుంచి రూ. 245 కోట్లే ఇచ్చారు. రూ. 55 కోట్ల కోత విధించారు. క్రీడాకారుల ప్రోత్సాహకాల నిధిని రూ. 111 నుంచి రూ. 70 కోట్లకు కుదించారు. క్రీడాభివృద్ది నిధిని సైతం రూ. 77.15 కోట్ల నుంచి రూ. 50 కోట్లకు తగ్గించారు. ఓవరాల్గా క్రీడలకు రూ. 2826 కోట్లు కేటాయింగా.. పెంచిన రూ. 50 కోట్ల మొత్తాన్ని ఖేలో ఇండియా ఖాతాలో వేశారు. ' క్రీడా సమాఖ్యలకు ఏమైనా నిధుల కొరత ఉంటే కచ్చితంగా పరిశీలిస్తాం. అందుకు పున సమీక్ష ఉంది. సమాఖ్యలకు మరింత నిధులు అవసరమైతే కచ్చితంగా అందిస్తాం' అని మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు.