Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆక్లాండ్లో భారత్కు చావోరేవో
- సిరీస్ విజయంపై కివీస్ గురి
- భారత్, కివీస్ రెండో వన్డే నేడు
- ఉ. 7.30 నుంచి స్టార్స్పోర్ట్స్లో...
న్యూజిలాండ్ పర్యటనను 5-0 టీ20 సిరీస్ విజయంతో టీమ్ ఇండియా ఘనంగా మొదలెట్టింది. వన్డే సిరీస్కు ఫేవరెట్గా వచ్చింది. ఏ ఫార్మాట్లోనైనా నవంబర్ 25, 2019 తర్వాత న్యూజిలాండ్ గెలుపు రుచే ఎరుగదు. వన్డే సిరీస్కు తీవ్ర ఒత్తిడిలో వచ్చింది. హామిల్టన్ వన్డే ఫలితం ఇరు శిబిరాల ఆత్మవిశ్వాసంలో మార్పు తీసుకొచ్చింది. ఓ విజయంతో వన్డే సిరీస్ సొంతం చేసుకునే స్థితిలో న్యూజిలాండ్, ఓ ఓటమితో వన్డే సిరీస్పై ఆశలు వదులుకునే దుస్థితిలో నిలిచింది. వన్డే సిరీస్తో చావోరేవో తేల్చుకోవాల్సిన తరుణంలో కోహ్లిసేన ఆక్లాండ్ వన్డేకు సిద్ధమవుతోంది.
నవతెలంగాణ-ఆక్లాండ్
ఇటీవల భారత్ వరుసగా సిరీస్లో తొలి మ్యాచ్లో ఓటమి ఎదుర్కొంటుంది. అయినా, బలంగా పుంజుకుని సిరీస్ విజయాలు సొంతం చేసుకుంది. జనవరి ఆరంభంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లోనూ ఇదే పరిస్థితి. అంతకముందు వెస్టిండీస్తో స్వదేశీ సిరీస్లోనూ ఇదే సీన్. రెండు సందర్బాల్లోనూ కోహ్లిసేన వరుస మ్యాచుల్లో విజయాలు సాధించింది. ఇప్పుడు న్యూజిలాండ్తో సిరీస్లోనూ అదే కఠిన సవాల్ ముందు నిలిచింది. ఆక్లాండ్లో చావోరేవో తేల్చుకోవాల్సిన వన్డేలో విజయమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. టీ20 సిరీస్ను దారుణంగా కోల్పోయిన న్యూజిలాండ్.. వన్డే సిరీస్ను సొంతం చేసుకుని ఊరట చెందాలని చూస్తోంది. చిన్న బౌండరీలు, భారీ స్కోర్లు, ఉత్కంఠ రేపుతున్న సమీకరణాల నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే సమరం నేడు.
ఓపెనర్లు మెరువాలి : టెస్టు క్రికెట్లో ఓపెనర్లుగా పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ అరంగ్రేటంలోనే తమదైన ముద్ర వేశారు. చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నారు. వన్డే అరంగ్రేటం ఈ ఇద్దరికీ భిన్నంగా మొదలైంది. హామిల్టన్లో తొలి వికెట్కు 50 పరుగులు జోడించి శుభారంభం అందించినా.. మెరుగైన ఆరంభాలను పృథ్వీ, మయాంక్ సద్వినియోగం చేసుకోలేదు. పృథ్వీ షా అమ్ములపొదిలో చూడచక్కని షాట్లు ఉన్నాయి. వైవిధ్యమైన షాట్లతో పాటు సంప్రదాయ స్ట్రోక్స్, డ్రైవ్స్తో పరుగుల వరద పారించగలడు. భారత్-ఏ తరఫున న్యూజిలాండ్-ఏపై మెగా ఇన్నింగ్స్లు సైతం నమోదు చేశాడు. మయాంక్ అగర్వాల్ సైతం వైట్ బాల్ క్రికెట్లో మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ ఇద్దరూ నేడు కీలక మ్యాచ్లో రాణించాలని భారత్ కోరుకుంటోంది. టాప్ ఆర్డర్లో పృథ్వీ, మయాంక్ మెరిస్తే ఆక్లాండ్లో భారత్ లక్ష్యాన్ని నిర్దేశించినా, ఛేదించినా సూపర్ హిట్గానే నిలువనుంది!. కెప్టెన్ కోహ్లి, శ్రేయష్ అయ్యర్ జోరుమీదున్నారు. మిడిల్ ఆర్డర్లో ఈ ఇద్దరూ మ్యాచ్ గమనం తేల్చనున్నారు. లోయర్ ఆర్డర్లో కెఎల్ రాహుల్ అదనపు బలమయ్యాడు. గత ఐదారేండ్లలో ఎం.ఎస్ ధోని తర్వాత నం.5వ స్థానంలో రాహుల్ మాత్రమే మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. హామిల్టన్లో నిజానికి రాహుల్ తన ఇన్నింగ్స్తో మహిని తలపించాడు!. స్కోరు వేగం పెంచేందుకు ఆఖర్లో రాహుల్ నేడూ కీలకం కానున్నాడు. మనీశ్ పాండే, కేదార్ జాదవ్లు బలమైన ఇన్నింగ్స్లు కొట్టాలని చూస్తున్నారు.
బౌలింగ్ విభాగంలో భారత్ కీలక ఎంపిక సందిగ్థతలను ఎదుర్కొంటుంది. జశ్ప్రీత్ బుమ్రా తోడుగా పేస్ బాధ్యతలు పంచుకునేందుకు షార్దుల్ ఠాకూర్తో నవదీప్ సైని పోటీపడుతున్నాడు. హామిల్టన్లో ధారాళంగా పరుగులు ఇచ్చిన కుల్దీప్ యాదవ్ స్థానంలో యుజ్వెంద్ర చాహల్ నేడు ఆడనున్నాడు. మహ్మద్ షమి, రవీంద్ర జడేజాలు బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర పోషించనున్నారు.
సిరీస్పై కివీస్ గురి : 2019 వరల్డ్కప్ ఫైనల్స్ తర్వాత న్యూజిలాండ్ వన్డే ఆడటం హామిల్టన్లోనే తొలిసారి. వరుస ఓటములు ఆతిథ్య జట్టు ఆత్మవిశ్వాసం దెబ్బతీయలేకపోయాయి. టాప్ ఆర్డర్లో మార్టిన్ గప్టిల్ లయ అందుకున్నాడు. కానీ తనదైన ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. హెన్రీ నికోల్స్ అర్ధ సెంచరీతో మెరిశాడు. ఆక్లాండ్లోనూ హెన్రీ షో నడిచే వీలుంది. నం.3లో ఆడిన బ్లండెల్ స్వీప్ షాట్లు ఆడటంలో విలియమ్సన్ను అనుకరించినా, విజయవంతం కాలేదు. స్పిన్నర్లను స్వీప్ షాట్లతో కివీస్ బ్యాట్స్మెన్ తెలివిగా ఆడుతున్నారు. రాస్ టేలర్ ముందుండి స్పిన్ దాడిని నడిపిస్తున్నాడు. ఆల్రౌండర్లు జిమ్మీ నీషమ్, కొలిన్ డీ గ్రాండ్హౌమ్ నుంచి కివీస్ బాధ్యతాయుత ప్రదర్శన ఆశిస్తోంది. తాత్కాలిక కెప్టెన్, వికెట్ కీపర్ టామ్ లేథమ్ జోరుమీదున్నాడు. విలియమ్సన్ లేని వేళ జట్టును సిరీస్ విజయం దిశగా నడిపించాలని తపిస్తున్నాడు. బంతిలో కైల్ జేమిసన్, బెనెట్, సౌథీలు కీలకం కానున్నారు. మిచెల్ శాంట్నర్ స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు.
పిచ్ రిపోర్టు : న్యూజిలాండ్ చిన్న బౌండరీల స్టేడియాలు కలిగి ఉంది. అయినా, ఆక్లాండ్ అందులో మరింత భిన్నమైనది. ఇక్కడ బంతి లైన్, లెంగ్త్ ఏమాత్రం గతి తప్పినా బౌండరీ లైన్ ఆవల పడుతుంది. ఆ అవకాశం కోసం బ్యాట్స్మెన్ ఎదురుచూస్తారు, ఆ చాన్స్ ఇవ్వకూడదని బౌలర్లు అనుకుంటారు. భారీ స్కోర్లు నమోదు కానున్న మ్యాచ్కు వాతావరణం సైతం అనుకూలించనుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది!.
తుది జట్లు (అంచనా)
భారత్ : మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, విరాట్ కోహ్లి, శ్రేయష్ అయ్యర్, కెఎల్ రాహుల్, మనీశ్ పాండే, రవీంద్ర జడేజా, నవదీప్ సైని, యుజ్వెంద్ర చాహల్, మహ్మద్ షమి, జశ్ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్, రాస్ టేలర్, టామ్ లేథమ్, కొలిన్ డీ గ్రాండ్హౌమ్, జిమ్మీ నీషమ్, మిచెల్ శాంట్నర్, కైల్ జేమీసన్, హమిశ్ బెనెట్, టిమ్ సౌథీ.