Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్వీటర్లో అభిమానులను కోరిన కోహ్లి
మౌంట్మౌంగానురు : '21 ఏండ్ల పాటు సచిన్ టెండూల్కర్ భారత్ ఆశయాలను, అభిమానుల అంచనాల భారం మోశాడు. తొలిసారి సచిన్ను మోసిన గొప్ప సందర్భం అది'.. 2011 వరల్డ్కప్ విజయం తర్వాత సచిన్ టెండూల్కర్ను టీమ్ ఇండియా సహచరులు భుజాలపై మోసిన సన్నివేశంపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లి గతంలో చెప్పిన మాట ఇది. ఇప్పుడు ఆ సన్నివేశమే ప్రతిష్టాత్మక లారెస్ స్పోర్ట్స్ పురస్కారం రేసులో నిలిచింది. 2000-2020 ( రెండు దశాబ్దాల్లో) స్పోర్టింగ్ మూమెంట్ అవార్డు రేసులో సచిన్ టెండూల్కర్ నిలిచాడు. లారెస్ స్పోర్ట్స్ అవార్డు కమిటీ ఇటీవల ఐదుగురుతో తుది జాబితాను విడుదల చేసింది. షార్ట్లిస్ట్ సచిన్ టెండూల్కర్ నిలిచాడు. సచిన్కు ప్రతిష్టాత్మక పురస్కారం దక్కేందుకు మాస్టర్కు ఆన్లైన్లో ఓటేయాలని కెప్టెన్ కోహ్లి ట్వీటర్లో అభిమానులను కోరాడు. ' స్నేహితుడు, సహచరుడు, మెంటర్, దిగ్గజం. లారెస్ స్పోర్టింగ్ మూమెంట్ 2000-2020 అవార్డుకు అందరు కలిసి సచిన్ టెండూల్కర్కు ఓటేద్దాం' అని ఓటింగ్ లింక్ షేర్ చేస్తూ విరాట్ కోహ్లి ట్వీట్ చేశాడు. ఫిబ్రవరి 17న బెర్లిన్లో జరిగే లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు కార్యక్రమంలో విజేతను ప్రకటించనున్నారు.