Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ క్రికెటర్ చేతన్ చౌహన్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ఎంతోమంది క్రికెటర్లు, క్రీడాకారులు రాజకీయాల్లో చేరారు. అక్కడ రాణించినా, రాణించకపోయినా క్రీడాస్ఫూర్తిని మాత్రం ఎన్నడూ మరువలేదు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ మంత్రి చేతన్ చౌహన్ మాత్రం క్రీడా విలువలను పూర్తిగా వదిలేసినట్టు కనిపిస్తున్నాడు. భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహన్ భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక క్రికెట్పై క్రీడాస్ఫూర్తి లేని వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్తో క్రికెట్ ఆడేందుకు వీల్లేదని పేర్కొన్నాడు. దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా చేతన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ' భారత్, పాకిస్థాన్ తిరిగి క్రికెట్ ఆడాలి. క్రికెట్ సంప్రదాయ అభిమానులను తిరిగి ఆటవైపు ఆకర్షించేందుకు భారత్, పాక్ ముఖాముఖి అవసరం' అని యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ' భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక క్రికెట్ జరగటానికి వీల్లేదు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఆశాజనకంగా లేవు. పాకిస్థాన్లో ఆడటం ఏమాత్రం సురక్షితం కాదు. ఉగ్రవాదులకు క్రికెట్ను పట్టించుకోరు, ఉగ్రవాదులు పాక్లో ఉన్నంతకాలం ఆ దేశంతో ఆట ఆడేందుకు వీల్లేదు' అని చేతన్ చౌహన్ అన్నారు. న్యూజిలాండ్కు 0-3తో వన్డే సిరీస్ను కోల్పోవటంపై స్పందిస్తూ.. ' రోహిత్, ధావన్ వంటి సీనియర్లు లేనప్పుడు, అనుభవజ్ఞుడు అజింక్య రహానెను జట్టులోకి తీసుకోవాల్సింది. యువ క్రికెటర్ రిషబ్ పంత్కు జట్టు మేనేజ్మెంట్ చాలా అవకాశాలే ఇచ్చింది. కనీసం వచ్చే అవకాశాలను అయినా రిషబ్ పంత్ సద్వినియోగం చేసుకోవాలి' అని చేతన్ పేర్కొన్నాడు.