Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోషల్ మీడియా ఖాతాలపై కెప్టెన్ కోహ్లి ప్రశ్న
హామిల్టన్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా ప్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ (ఆర్సీబీ) సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు అదృశ్యం కావటంతో ఆ జట్టుకు ఆటగాళ్లతో పాటు అభిమానులు షాక్కు గురయ్యారు. ఆర్సీబీట్వీట్స్ పేరుతో ఉన్న ట్విటర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఖాతాల కవర్ ఫోటోలు, ప్రోఫైల్ ఫోటోలను తొలగించారు. ఇదే సమయంలో సోషల్ మీడియా ఖాతాల పోస్టులు సైతం కనిపించకుండా పోయాయి. దీనిపై సోషల్ మీడియాలో అభిమానుల ఆందోళన కొనసాగుతుండగా.. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి జతకలిశాడు. ' పోస్టులు కనిపించకుండా పోతున్నాయి. కెప్టెన్కు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఆర్సీబీట్వీట్స్ మీకు ఏమైనా సహాయం కావాలి అనుకుంటే నాకు తెలియజేయండి' అని విరాట్ కోహ్లి ట్వీట్ చేశాడు. మిస్టర్ 360 బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ సైతం ట్వీటర్లో ఆర్సీబీపై షాక్కు గురయ్యాడు. ' ఆర్సీబీట్వీట్స్ మిత్రులారా, మన సోషల్ మీడియా ఖాతాలకు ఏమైంది? ఇది ఏమైనా వ్యూహాత్మక విరామమా?' అని డివిలియర్స్ ప్రశ్నించాడు. కవర్ ఫోటో, ప్రోఫైల్ ఫోటోలను తీసేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తన పేరులో బెంగళూర్ను తీసేసింది. రాయల్ చాలెంజర్స్గా మార్చుకుంది. త్వరలో నూతన ఫోటోలతో వస్తున్నట్టు ఆర్సీబీ అభిమానులకు ఓ తీయని కబురు ఆలస్యంగానైనా చెప్పింది. 2020 ఐపీఎల్ సీజన్ కోసం ఆర్థిక సేవల కంపెనీ ముత్తూట్ గ్రూప్తో ఆర్సీబీ మూడేండ్ల ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. టైటిల్ స్పాన్పర్లో భాగంగా ప్లేయింగ్, నాన్ప్లేయింగ్ జెర్సీల్లో ముత్తూట్ గ్రూప్ లోగో ప్రధానంగా ఉండనుంది. మీడియా, డిజిటల్ మీడియా వేదికల్లో ముత్తూట్ గ్రూప్ లోగోను ప్రధానంగా చూపించనున్నారు.