Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నేడు
ముంబయి : 2020-21 స్వదేశీ సీజన్ క్యాలెండర్కు తుది రూపు కల్పించటం, పదవీ కాలం ముగించుకున్న అంబుడ్స్మన్, ఎథిక్స్ ఆఫీసర్ను నియమించటం సహా నూతనం ఏర్పాటు చేయబడిన భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ)కు నిధులు కేటాయింపు అంశంపై నేడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అత్యున్నత నిర్ణయాక కమిటీ అపెక్స్ కౌన్సిల్ తేల్చనుంది. చివరగా నవంబర్లో సమావేశం అయిన అపెక్స్ కౌన్సిల్ నేడు న్యూఢిల్లీలో భేటీ కానుంది. ఏడాది కాలానికి అంబుడ్స్మన్గా నియమితులైన జస్టిస్ డికె జైన్ రెండేండ్ల కాలం పూర్తి చేసుకున్నాడు. కొత్త అంబుడ్స్మన్ను నియమించటం, జైన్కు మరో ఏడాది పొడగింపు ఇవ్వటంపై నేడు గంగూలీ అధ్యక్షతన సమావేశం కానున్న అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. నూతనంగా ఏర్పాటు చేయబడిన భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) కార్యాచరణ ఆరంభానికి ప్రాథమికంగా రూ. 15 కోట్లు అవసరం అని బీసీసీఐకి తెలిపింది. దీర్ఘకాలంలో ఐసీఏ సొంతంగా నిధులు సమీకరించుకోవాల్సి ఉన్నా, ప్రస్తుతానికి బీసీసీఐ ఆర్థిక సహాయం అందించాల్సి ఉంది. దీనిపై గంగూలీ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక కీలకంగా మారిన 2020-21 స్వదేశీ సీజన్ క్యాలెండర్, వేదికలకు మ్యాచుల కేటాయింపు షెడ్యూల్కు గంగూలీ కమిటీ తుది రూపు, అంగీకారం తెలపాల్సి ఉంది. కాగ్ ప్రతినిధి ఈ సమావేశంలో బీసీసీఐలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘలనలపై కీలక ప్రశ్నలు లెవనెత్తే అవకాశం కనిపిస్తోంది.