Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : టీమ్ ఇండియా తన రెండో డేనైట్ టెస్టుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. స్వదేశంలో బంగ్లాదేశ్తో చారిత్రక కోల్కత గులాబీ టెస్టును విజయవంతం చేసుకున్న భారత్.. ఇప్పుడు విదేశీ గడ్డపై తొలి గులాబీ మ్యాచ్ ఆడబోతుంది. ఆదివారం అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గులాబీ టెస్టు ఆడుతున్నట్టు ప్రకటించాడు. ' అవును, ఆస్ట్రేలియాలో భారత్ డేనైట్ టెస్టు ఆడనుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుంది' అని గంగూలీ పేర్కొన్నాడు.
ఐసీఏకు రూ. 2 కోట్లు : భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) కార్యకలాపాల ఆరంభానికి బీసీసీఐ రూ. 2 కోట్లు నిధులు మంజూరు చేసింది. 2019 సెప్టెంబర్లో ఐసీఏ తొలి ఆఫీస్ బేరర్లను ఎన్నుకుంది. తాత్కాలికంగా రూ. 15-20 కోట్ల నిధులకు బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. తొలి విడతగా రూ. 5 కోట్లు ఆశించిన ఐసీఏకు నిరాశే ఎదురైంది. పన్నుల కారణంగా ఐసీఏకు ఏకమొత్తంలో రూ. 5 కోట్లు విడుదల చేయలేదని, అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని బీసీసీఐ అధికారులు తెలిపారు.