Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అండర్-17 మహిళల ప్రపంచకప్ ఫుట్బాల్ ఫైనల్ ముంబయిలో జరగనుంది. మంగళవారం భారత ఫుట్బాల్ సమాఖ్య ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు హాజరయ్యారు. నవంబర్ 21 నుంచి జరిగే ఫిఫా టోర్నీకి భారత్లోని ఐదు వేదికలను ఖరారు చేశారు. కోల్కతా, అహ్మదాబాద్, భువనేశ్వర్, గువహాటితోపాటు ముంబయిలో ప్రపంచకప్ పోటీలు జరగనున్నాయి. మొత్తం 16 జట్ల మధ్య 32 మ్యాచ్లు పై వేదికలలో జరగనుండగా, ఫైనల్కు మాత్రం ముంబయి ఆతిథ్యమిస్తోన్నట్లు నిర్వాహకులు తెలిపారు. తొలిసారి ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు భారత్కు దక్కడంతో మన జట్టు నేరుగా టోర్నీ బరిలోకి దిగుతోంది.