Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాక్టీస్ మ్యాచ్ గెలిచారు..
- టీ20 ప్రపంచకప్ టోర్నీ
- మరో రెండు రోజుల్లో
బ్రిస్బేన్: టీ20 ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. వెస్టిండీస్తో జరిగిన తొలి సన్నాహక మ్యాచ్లో 2 పరుగుల తేడాతో ఉత్కంఠకర విజయం సాధించింది. ప్రాక్టీస్ మ్యాచ్లోనే భాగంగా జరిగిన సూపర్ ఓవర్లో మాత్రం పరాజయాన్ని చవిచూసింది. తొలిగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 107 పరుగులే చేసినా బంతితో స్పిన్నర్ పూనమ్ యాదవ్ (3/20) చెలరేగడంతో హర్మన్సేన ఆఖరి బంతికి గట్టెక్కింది. ప్రత్యర్థిని 105/7కు పరిమితం చేసింది. ఛేదనలో విండీస్ 13 ఓవర్లకు 57/1తో పటిష్ట స్థితిలో నిలిచానా, ఓపెనర్ లీ ఆన్ కిర్బీ(42)ను దీప్తి శర్మ పెవిలియన్కు పంపించి బ్రేక్ ఇచ్చింది. మరికాసేపటికే స్టెఫానీ టేలర్(16), చెడీన్ నేషన్(0), డియాండ్ర డాటిన్(1) వెంటవెంటనే ఔటవ్వడంతో కరీబియన్లు 17 ఓవర్లకు 67/5తో కష్టాల్లో పడ్డారు. ఈ క్రమంలో 18 బంతుల్లో 39 పరుగులు చేయాల్సిన దశలో వెస్టిండీస్ అమ్మాయిలు అద్భుతంగా పుంజుకున్నారు. 19వ ఓవర్లో హేలీ మాథ్యూస్(25), చినెల్ హెన్రీ(17) కలిసి మూడు బౌండరీలు, ఒక సిక్సర్ బాదడంతో సమీకరణం ఒక్కసారిగా 6 బంతుల్లో 11గా మారిపోయాయి. పూనమ్ వేసిన ఆఖరి ఓవర్ రెండో బంతికి హేలీ బౌండరీ బాదడం.. నాలుగో బంతికి మాథ్యూస్ను పూనమ్ ఔట్ చేయడంతో ఆట మరింత రసవత్తరంగా మారింది. చివరి 2 బంతుల్లో 4 పరుగులు చేయాల్సిన దశలో విండీస్ అమ్మాయిలు ఐదో బంతికి కంబెల్లా ఒక పరుగు తీయగా... చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా హెన్రీ క్యాచ్ను వేద కృష్ణమూర్తి చక్కగా ఒడిసిపట్టుకోవడంతో భారత్ 2 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. అంతకుముందు టీమిండియా టాప్ ఆర్డర్ విఫలమైంది. ఓపెనర్ స్మృతి మంధాన(4), జెమీమా(0) స్వల్ప స్కోర్కే ఔటయ్యారు. రెండు బౌండరీలు బాదిన ఓపెనర్ షెఫాలి వర్మను షామిలా కనెల్ (2/20) పెవిలియన్ పంపడంతో భారత్ 3.1 ఓవర్లకు 17/3తో నిలిచింది. సారథి హర్మన్ప్రీత్ (11)సైతం క్రీజులో ఎక్కువసేపు నిలవలేదు. మరి కాసేపటికే వేద కృష్ణమూర్తి(5)ని అఫి ఫ్లెచర్ ఔట్ చేయడంతో 11.2 ఓవర్లకు టీమిండియా 52/5తో కష్టాల్లో పడింది. అయితే దీప్తి శర్మ (21) పూజా వస్త్రకర్(13), తానియా భాటియా(10) ఆఖర్లో శిఖా పాండే(24) పోరాడటంతో భారత్ 107 పరుగులు చేయగల్గింది.
అదరగొట్టిన ఆటపట్టు
ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు బ్యాటింగ్తో అదరగొట్టింది. 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 78 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెకు హాసిని పెరీరా(29) అండగా నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. శ్రీలంక 12.3 ఓవల్లో వికెట్ కోల్పోకుండా 123 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఎక్స్ట్రాల రూపంలో 16 పరుగులు రావడం విశేషం. మరో మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో గెలిచింది.