Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాడ్రిడ్: స్పెయిన్ పుట్బాల్ కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా(21) కరోనా వైరస్ సోకి మృతి చెందడం ఆ దేశంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సోమవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఆయన ప్రస్తుతం అట్లెటికో పోర్టాడా ఆల్టా పుట్బాల్ టీమ్కు కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. గార్సియా గతకొంత కాలంగా లుకేమీయాతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతడని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్యులు మెరుగైన చికిత్సకు ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మృతి చెందాడని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కరోనా క్రీడా రంగాన్ని సైతం చుట్టుముట్టడంతో స్పెయిన్ ప్రభుత్వం దేశంలో జరిగే అన్ని టోర్నీలను రద్దు చేసింది. మాల్స్, విహారయాత్రలపై ఆంక్షలు విధించింది.