Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్బు కోసమేనంటూ ట్విట్టర్లో పోస్టు
హైదరాబాద్ : ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ -2020 నిర్వాహకులపై భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ప్రపంచమంతా విస్తరిస్తున్న వేళ.. టోర్నీ నిర్వహించడంపై విమర్శలు చేశారు. ఆటగాళ్ల సంక్షేమం, భావాలు పట్టించుకోకుండా, కేవలం డబ్బుల కోసమే వారు టోర్నీ నిర్వహించారన్నారు. అంతకుమించి ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్-2020 నిర్వహించడానికి సరైన కారణం మరేమీ లేదన్నారు. ట్విట్టర్లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ నిర్వహణకు సంబంధించి డెన్మార్క్ ఆటగాడు మాడ్స్ కాన్రాడ్ పీటర్సన్ చేసిన ట్విట్పై సైనా స్పందించారు. 'ఓవైపు కరోనా భయంతో ప్రపంచమంతా మూత పడుతుంటే.. నేను ఆల్ ఇంగ్లాండ్ టోర్నీ ఆడాలంటే భయమేస్తోంది. 14 రోజులపాటు నేను అనారోగ్యంగానే ఉన్నానని భావించాల్సి ఉంటుంది' అని మాడ్స్ ట్వీట్ చేశారు. అయితే, ప్రపంచమంతా కరోనా వైరస్ నేపథ్యంలో పెద్ద పెద్ద క్రీడా ఈవెంట్లనే రద్దు చేయడమో, వాయిదా వేయడమో లేక ప్రేక్షకులను అనుమతించకుండా నిర్వహించడమో చేస్తున్నారు. కానీ, బర్మింగ్హామ్లో జరిగిన ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ను సాధారణ పరిస్థితుల మధ్యే నిర్వహించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.