Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఐపీఎల్13పై సౌరవ్ గంగూలీ
-స్టేడియాల అప్పగింతకు సుముఖత
న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13పై ఇప్పుడు తాజాగా చెప్పటానికి ఏమీ లేదని, గతంలో ఎక్కడ ఉన్నామో ఇప్పుడూ అక్కడే ఉన్నామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్13 భవిష్యత్పై స్పందించేందుకు నా వద్ద సమాధానం లేదని గంగూలీ పేర్కొన్నాడు. ఐపీఎల్13ను ఏప్రిల్ 15కు వాయిదా వేసిన తర్వాత, పరిస్థితిని సమీక్షించేందుకు సోమవారం ఎనిమిది ప్రాంఛైజీల యజమానులతో బీసీసీఐ టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడాల్సి ఉంది. కానీ చర్చిండానికి పరిస్థితిలో ఎటువంటి పురోగతి లేదని సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేశారు. ఐపీఎల్ పరిస్థితిపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడారు. ' ఐపీఎల్13పై ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమీ మాట్లాడలేను. లీగ్ వాయిదా వేసిన రోజు ఎక్కడున్నామో, ఇప్పుడూ అక్కడే ఉన్నాం. గత పది రోజుల్లో ఏమీ మారలేదు. దీనిపై సమాధానం ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు. ఐపీఎల్పై వాయిదా స్థితి కొనసాగుతుంది' అని గంగూలీ అన్నారు. భవిష్యత్ టోర్నీల ప్రణాళిక షెడ్యూల్ చేయబడింది. ఇప్పుడు ఏమీ ప్లాన్ చేయలేం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎఫ్టీపీని మార్చలేం. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ సహా అన్ని క్రీడలు నిలిచిపోయావని దాదా అన్నాడు. ఐపీఎల్ నిలిచిపోవటంతో బీమా సొమ్ము వస్తుందనే నమ్మకం లేదని దాదా వ్యాఖ్యానించాడు. లీగ్ వాయిదాతో, రద్దుతో బీమా డబ్బు వస్తుందనే విశ్వాసం లేదు. ఇది ప్రభుత్వం విధించిన లాక్డౌన్. బీమాలో ప్రభుత్వ లాక్డౌన్ను కవర్ చేస్తారో లేదో తెలియదు. కరోనా వైరస్ బాధితుల కోసం, క్వారంటైన్ కోసం స్టేడియాలను ఇవ్వాలని ప్రభుత్వం కోరితే బీసీసీఐ సదా సిద్ధంగా ఉంటుందని దాదా అన్నాడు. బోర్డు కార్యదర్శి జై షాతో ఇంకా మాట్లాడలేదు. త్వరలోనే జై షాతో కలిసి పరిస్థితిని సమీక్షిస్తాం. ప్రభుత్వ సూచనలను పాటిస్తాం అని గంగూలీ అన్నాడు.