Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-విశ్రమించను : బాక్సర్ మేరీకోమ్
న్యూఢిల్లీ : ఆరు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్. మహిళల బాక్సింగ్లో మేరునగ దిగ్గజం. 2012 ఒలింపిక్స్లో కాంస్యం పతకం సాధించినా, విశ్వ క్రీడల్లో పసిడి పట్టే వరకూ విశ్రమించనని అంటోంది స్టార్ బాక్సర్ ఎం.సీ మేరీకోమ్. 2012 ఒలింపిక్స్లో 51 కేజీల విభాగంలో పోటీపడిన మేరీకోమ్, 2016 రియో ఒలింపిక్స్కు అర్హత సాధించలేదు. ' ఒలింపిక్స్లో భారత్కు స్వర్ణం సాధించటమే నా లక్ష్యం. ఈ వయసులో ఒలింపిక్స్ పసిడి కోసం ఎంతో శ్రమపడుతున్నాను. నాకు ఇప్పుడు ఒలింపిక్స్ అర్హత సాధించటమే కఠినమైన సవాల్. ప్రపంచ చాంపియన్షిప్స్లు సాధించటం, ఒలింపిక్స్లో పతకం కొట్టడంలో రహస్యం ఏమీ లేదు. గెలిచే వరకూ నేను పోరాడుతూనే ఉంటాను. భారత్కు ఒలింపిక్స్లో పసిడి అందించేవరకూ విశ్రమించను' అని మేరీకోమ్ విశ్వాసం వ్యక్తం చేసింది.