Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-విరాట్ పట్ల ఆసీస్ విధేయత
-మైకల్ క్లార్క్ తీవ్ర ఆరోపణలు
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా క్రికెటర్లపై ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకల్ క్లార్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కాంట్రాక్టుల కోసం భారత కెప్టెన్ విరాట్ కోహ్లితో స్వార్థపూరిత విధేయత ప్రదర్శిస్తున్నారని క్లార్క్ ఆరోపించాడు. ఓ టెలివిజన్ చానల్తో మాట్లాడుతూ క్లార్క్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ' ప్రపంచ క్రికెట్లో భారత్ ఆర్థికంగా ఎంత బలమైన శక్తి అనేది అందరికి తెలుసు. ఐపీఎల్తో అంతర్జాతీయంగా, దేశీయంగా మరింత పట్టు సాధించింది. ఆస్ట్రేలియా సహా భారత్తో తలపడేందుకు వెళ్తోన్న అన్ని జట్లు కోహ్లిసేనకు విధేయంగా వ్యవహరిస్తున్నాయని నా భావన. విరాట్ కోహ్లి లేదా ఇతర భారత క్రికెటర్లను స్లెడ్జింగ్ చేసేందుకు భయపడుతున్నారు. మాటల యుద్ధానికి వారిని ఐపీఎల్ అడ్డుకుంటోంది. నేను కోహ్లిని కవ్వించను, ఎందుకంటే అతడి బెంగళూర్ జట్టుకు ఎంచుకుంటే మిలియన్ డాలర్లు సొంతమవుతాయనే భావనలో ఉంటున్నారు. కొంత కాలంగా ఈ వాతావరణం ఇతర దేశాల క్రికెటర్లతో కనిపిస్తోంది' అని కార్క్ అభిప్రాయపడ్డాడు. భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ వార్లో ఎన్నోసార్లు ఇరు బోర్డుల ఘర్షణకు దారిదీసింది. 2008 మంగీ గేట్, 2018 ఘటనలు భారత్ ఆసీస్ క్రికెట్ వార్లో ప్రధానంగా కనిపిస్తాయి. స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లి బహిరంగ విమర్శలతో ఇరు బోర్డులు సైతం వివాదంలో భాగమైన సంగతి తెలిసిందే.