Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సంజీవ్ గుప్తా
ముంబయి : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ కొనసాగడాన్ని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపీసీఏ) జీవిత కాల సభ్యుడు సంజీవ్ గుప్తా ప్రశ్నించారు. బీసీసీఐ చీఫ్గా గంగూలీ కొనసాగకూడదని గుప్తా పేర్కొన్నారు. బీసీసీఐ నిబంధనలు ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బోర్డుకు ఒకసారి నామినేట్ అయితే వాళ్లు అధ్యక్షుడిగా కొనసాగకూడదనే విషయాన్ని గుప్తా గుర్తు చేశారు. గంగూలీతో పాటు ఇతర అధికారులకు పంపిన ఈమెయిల్లో గుప్తా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ నెల 28న జరిగే సమావేశం తరువాత ఐసీసీ బోర్డులో బీసీసీఐ ప్రతినిధిగా గంగూలీ నియమించబడతాడు. దీంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఐసీసీ చైర్మన్ రేసులో గంగూలీ ఉంటాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ రాజ్యాంగంలోని రూల్ 14(9)ను గుప్తా చేశారు. 'మీరు ఐసీసీకి నామినేట్ కావడం ఖాయంగా ఉంది. దీంతో మీ బీసీసీఐ అధ్యక్ష పదవి ఖాళీ అవుతుంది' అని గుప్తా తెలిపారు. అయితే గుప్తా అభ్యంతరాన్ని బీసీసీఐ అధికారి ఒకరు కొట్టివేశారు. 'ఆఫీసు బేరర్లు ఐసీసీకి ఎంపిక అయితే ఈ నిబంధన వర్తిస్తుంది. ఆఫీసు బేరర్లు కాకుండా ఇతరుల్ని బీసీసీఐ బలవంతంగా నామినేట్ చేస్తే ఇది వర్తించదు' అని చెప్పారు.