Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఐసీసీపై షోయబ్ అక్తర్ ఘాటు విమర్శ
కరాచీ : పాకిస్థాన్ దిగ్గజ పేసర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)పై ఘాటు విమర్శలు చేశారు. భారత మాజీ క్రికెటర్ సంజరు మంజ్రేకర్తో కలిసి ఓ వెబ్సైట్ పోడ్కాస్ట్లో మాట్లాడిన అక్తర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ' ఐసీసీ క్రికెట్ను నాశనం చేసింది. గత పదేండ్లలో క్రికెట్ నాశనాన్ని విజయవంతంగా ముగించింది. (ఐసీసీ) వారు ఏం చేయాలనుకున్నారో, అదే చేశారు. వన్డే, టీ20ల్లో ఓవర్కు ఒకే బౌన్సర్ నిబంధన మార్చాలని పదేపదే కోరుతున్నాను. రెండు కొత్త బంతులు, సర్కిల్ ఆవల నలుగురు ఫీల్డర్లతో క్రికెట్ పూర్తిగా బ్యాట్స్మెన్ ఆటగా మారింది. స్వచ్ఛమైన క్రికెట్ నాణ్యత పడిపోతుంది. సచిన్ వర్సెస్ అక్తర్ పోరాటాలు ఇప్పుడెక్కడీ' అని షోయబ్ అక్తర్ విమర్శించాడు.