Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ
కోల్కత : మహేంద్రసింగ్ ధోని వీడ్కోలు వార్త మరోసారి సోషల్ మీడియాను ఊపేసింది. అంతర్జాతీయ క్రికెట్కు మహి గుడ్బై చెప్పాడంటూ సోషల్ మీడియాలో ఈ వార్త ట్రెండ్ అయ్యింది. ధోని వీడ్కోలు వార్తలు పుకార్లని చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ స్పందించారు. ' స్నేహితులను ఇంటికి పిలిచి నేను రిటైర్ అవుతున్నానని చెప్పే వ్యక్తిత్వం మహిది కాదు. వీడ్కోలు ఎలా చెప్పాలో అతడిని తెలుసు. వీడ్కోలు వేళ వచ్చింది అనుకుంటే, బీసీసీఐకి సమాచారం ఇచ్చి.. మీడియాకు ముందుకొచ్చి ఆ విషయాన్ని వెల్లడిస్తాడు. టెస్టు కెరీర్ను ముగించినప్పుడు ఏం చేశాడో.. ఇప్పుడే అదే అనుసరిస్తాడు. సోషల్ మీడియాలో ఎన్నో విషయాలు ట్రెండ్ అవుతున్నాయి. అసత్య వార్తలుగా మిగిలిపోతున్నాయి. జనాలు ధోని వెంట ఎందుకు పడుతున్నారో అర్థం కావట్లేదు. ధోని గురించి నాకు తెలుసు. వీడ్కోలు అనుకుంటే.. మన అందరికీ ఆ విషయం అతడే చెబుతాడు' అని బెనర్జీ అన్నారు. కరోనా వైరస్ కారణంగా క్రికెట్ ఆగిపోయినా, ఐపీఎల్ జరుగకపోయినా, టీ20 వరల్డ్కప్ వాయిదా పడి వచ్చే ఏడాది జరిగినా పొట్టి ప్రపంచకప్లో ధోని ఆడతాడని బెనర్జీ విశ్వాసం వెలిబుచ్చారు. ' ధోని ఎంత ఫిట్గా ఉన్నాడో మీరు ఐపీఎల్లో చూస్తారు. టీ20 వరల్డ్కప్ వాయిదా పడినా, మహి వచ్చే ఏడాది వరల్డ్కప్ ఆడతాడు. అందులో సందేహం లేదు' అని బెనర్జీ తెలిపారు. 2019 వరల్డ్కప్ సెమీఫైనల్స్ ఓటమి తర్వాతి రోజు నుంచీ ఎం.ఎస్ ధోని వీడ్కోలుపై రోజుకో వార్త వస్తూనే ఉన్న సంగతి తెలిసిందే.