Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెల్బోర్న్: టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే ఆదాయపరంగా భారీస్థాయిలో నష్టపోవాల్సి వస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ కెవిన్ రాబర్ట్స్ అన్నారు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో జరగాల్సిన మెగా టోర్నీ కరోనా ముప్పుతో వాయిదా వేయాలని ఐసీసీ భావిస్తున్నట్టు తెలిసిందనీ, వాస్తవంగా 28న జరిగిన ఐసీసీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా దానిని జూన్ 10కి వాయిదా వేసింది ఇందుకేనని చెప్పుకొచ్చారు. అక్టోబర్లో టోర్నీ జరుగుతుందనే ఆశతో ఉన్నామనీ, ఒకవేళ వాయిదాపడితే 80 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల ఆదాయానికి గండిపడుతుందన్నారు. మ్యాచులకు అభిమానులను అనుమతించరు..కానీ బోర్డుకు 50 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల రాబడి వస్తుందని రాబర్ట్స్ తెలిపారు.
అందుకే పెర్త్లో టెస్ట్కు నో..
భారత్తో నాలుగు టెస్ట్ల సిరీస్లో భాగంగా ఒక టెస్ట్ను పెర్త్ వేదికకు కేటాయించడంపై చర్చ జరిగినా.. అందులో టెస్ట్ వద్దనుకున్నామని కెవిన్ రాబర్ట్స్ తెలిపారు. 8ఏండ్ల కాలంలో ఈ వేదికపై ఇంగ్లండ్తో నాలుగు, భారత్ రెండు టెస్ట్ మ్యాచ్లే జరిగాయన్నారు. బ్రిస్బేన్ రెండు టెస్ట్లకు మాత్రమే ఆతిథ్యం ఇచ్చిందని ఆ కారణంగానే పెర్త్ను కాదని బ్రిస్బేన్కు టెస్ట్ను కేటాయించామని శుక్రవారం ఓ మీడియాతో రాబర్ట్ తెలిపారు. నవంబర్ 21-25న ఆఫ్ఘనిస్తాన్తో డే-నైట్ టెస్టు ఆడతామనీ, ఆఫ్ఘనిస్తాన్తో ఆస్ట్రేలియాలో క్రికెట్ సీజన్ ప్రారంభమౌతుందన్నారు.