Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: టీమిండియా మాజీ మీడియం పేసర్ టిను యోహానన్ కేరళ క్రికెట్జట్టు కోచ్గా ఎంపికయ్యాడు. వీడియో కాన్ఫరెన్స్ జనరల్ బాడీ సమావేశంలో టినును కోచ్గా ఎంపిక చేసినట్లు ప్రకటించింది. సోమవారం జరిగిన కేరళ అడ్వైజరీ కమిటీ సమావేశంలో టిను యోహానన్ను ఐదుగురు సభ్యులు ప్రతిపాదించగా.. జనరల్ బాడీ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపింది. దీంతో టిను యోహానన్ రాబోయే రంజీ సీజన్నుంచి కేరళజట్టుకు కోచ్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక కేరళ జూనియర్ జట్లకు కోచ్ ఎంపికను బాధ్యతను ఆఫీస్ బేరర్లకు కేరళ క్రికెట్బోర్డు అప్పగించింది. టిను యోహానన్ 2002లో భారతజట్టు తరఫున మూడు వన్డేలు, మరో మూడు టెస్టులు మాత్రమే ఆడాడు.