Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెల్బోర్న్: స్వదేశంలో జరగాల్సిన టి20 ప్రపంచకప్ వాయిదాపడితే ఇండియన్ ప్రిమి యర్లీగ్(ఐపిఎల్)లో పాల్గొనడానికి సిద్ధమని అన్నాడు. సోమవారం మీడియాతో మాట్లా డుతూ... గత వారంలో జరిగిన ఐసిసి వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో టి20 ప్రపంచకప్పై స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో మెగాటోర్నీ జరిగే అవకాశాలు కష్టమేనని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్మిత్ తెలిపాడు. షెడ్యూల్ ప్రకారం టి20 ప్రపంచకప్ అక్టోబర్-నవంబర్లో జరగాల్సి ఉండగా.. ఈ టోర్నీ వాయిదా పడితే సెప్టెంబర్-అక్టోబర్ విండోపై బిసిసిఐ దృష్టి సారించిందని చెప్పుకొచ్చాడు. తాను న్యూ సౌత్లో శిక్షణ మొదలుపెట్టానని, బంతిపై లాలాజల నిషేధాన్ని ఐసిసి క్రికెట్ కమిటీ సిఫారసు చేయడం గురించి అడిగిన ప్రశ్నకు దానికి ప్రత్యామ్నాయాన్ని కనుగొనడం కష్టమని స్మిత్ సమాధానమిచ్చాడు. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఎంపికైన స్మిత్.. ఆస్ట్రేలియా ప్రభుత్వం సురక్షితమని భావించి అనుమతిస్తేనే ఐపిఎల్లో పాల్గొంటానని చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు.