Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కుమార సంగక్కర
న్యూఢిల్లీ: ఈతరం బెస్ట్ బ్యాట్స్మన్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడని శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కర అభిప్రాయపడ్డాడు. ఇన్స్ట్రాగ్రామ్లో జింబాబ్వే మాజీ పేస్ బౌలర్ ముంగాంబ్వాతో సోమవారం మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపాడు. సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు చేస్తే.. కోహ్లీ 70 సెంచరీలతో ఈతరం క్రికెటర్లలో అందరికంటే ముందుండడమే ఇందుకు ఉదాహరణ అని చెప్పుకొచ్చాడు. సచిన్ 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేయగల సత్తా ఒక్క కోహ్లీ ఉందని సంగక్కర అన్నాడు. ఇక బౌలర్ల విషయానికొస్తే మాత్రం ఆస్ట్రేలియన్ స్పిన్నర్ నాథన్ లియాన్ ప్రపంచ బెస్ట్ స్పిన్నర్ అని తెలిపాడు. పేస్ బౌలర్లలో మాత్రం మిఛెల్ స్టార్క్(ఆస్ట్రేలియా), జస్ప్రీత్ బుమ్రా(భారత్) గొప్ప అని, దీర్ఘకాలం క్రికెట్లోకొనసాగాలంటే ఫిట్నెస్ను కాపాడుకోవాల్సి ఉందన్నాడు. ఐసిసి వన్డే ర్యాంకింగ్స్లో కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. టెస్టుల్లో మాత్రం రెండో ర్యాంక్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.