Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరాచీ: కరోనా వైరస్ సోకడంతో పాకిస్తాన్ మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్ రియాజ్ షేక్(51) మృతి చెందాడు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ మంగళవారం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 1987 నుంచి 2005 వరకూ 43 ఫస్ట్ క్లాస్, 25 లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడాడు. రిటైర్మెంట్ అనంతరం మొయిన్ ఖాన్ క్రికెట్ ఆకాడమీలో ప్రధాన కోచ్గా పనిచేశాడు. రియాజ్ కంటే ముందు మరో పాకిస్తాన్ ఫస్ట్క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ కూడా కరోనా సోకి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.