Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిసిసిఐ వైఖరిపై పిసిబి ఛైర్మన్ వ్యాఖ్య
కరాచీ : 'మద్దతు ఇచ్చాం..ఇప్పుడు మాట నిలుపుకోండి' ఇదీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ షహర్యార్ ఖాన్ మాట. ఈ ఏడాది డిసెంబర్లో భారత్, పాకిస్తాన్ దైపాక్షిక సిరీస్ కోసం త్వరగా షెడ్యూల్ ఖరారు చేయమని గత వారం బోర్డు కార్యదర్శికి లేఖ రాసిన పిసిబి చీఫ్ కరాచీలో జరిగిన ఓ సమా వేశంలో ఈవిషయంపై మాట్లాడారు. ' గతేడాది ఐసిసిలో 'బిగ్ త్రీ' పద్దతికి పాకిస్తాన్ మద్దతు పలికింది. బిగ్ త్రీ ప్రకారం ఐసిసిలో పెత్తనం అంతా భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా చేతోల్లోకి వెళ్లిపో యింది. ఆర్థిక లావాదేవీ ల్లోనూ ఈమూడు దేశాలదే సింహాభాగం. ఈ విధానానికి మద్దతు తెలపడానికి పాకిస్తాన్కు స్వంత కారణాలు ఉన్నప్పటికీ..2015-2023 మధ్య భారత్ ఆరు దైపాక్షిక సిరీస్లు ఆడుతుందని అంగీకార ఒప్పందం కుదుర్చుకోవటమే..మా మద్దతుకు ప్రధాన కారణం. ఒప్పందం ప్రకారం ఈఏడాది డిసెంబర్లో పాకిస్తాన్ ఆతిథ్య దేశంగా టెస్ట్, వన్డే, టి20 టోర్నీ నిర్వహించాల్సి వుంది. దీని కోసం పిసిబి ఏర్పాట్లు చేస్తోంది. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం బిసిసిఐ డిసెంబర్లో సిరీస్కై షెడ్యూల్ ఖరారు చేయాలని కోరుతున్నాం' అని షహర్యార్ ఖాన్ వెల్లడించాడు. ప్రభుత్వం నుంచి అనుమతి లేదని సిరీస్ నిర్వహణపై వెనకాడుతున్న బిసిసిఐని మోసకారిగా చూడబోమని ఖాన్ చెప్పాడు. యు.ఏ.ఈ వేదికగా రెండు టెస్ట్లు, ఐదు వన్డేలు, టి20 సిరీస్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. బిసిసిఐ త్వరగా స్పందిస్తే మా పని వేగవంతం చేసుకుంటాం అని షహర్యార్ అన్నాడు. పిసిబి లేఖకు బిసిసిఐ ఇంకా సమాధానం ఇవ్వలేదు.