Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రెండో ఏడాదీ తన పేరును పరిశీలించలేదన్న ప్రణరు..
-స్పోర్ట్స్ అవార్డుల దరఖాస్తుల గడువు పెంపు
న్యూఢిల్లీ: వరుసగా రెండో ఏడాదీ అర్జున అవార్డుకు తన పేరును ప్రతిపాదించలేదని బ్యాడ్మింటన్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణరు కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టితో పాటు సమీర్ వర్మ పేర్లను అర్జున అవార్డుకు ప్రతిపాదించిన భారత బ్యాడ్మింటన్ సమాఖ్య(బారు).. కామన్వెల్త్, ఆసియా చాంపియన్షిప్లో పతకాలు నెగ్గిన తన పేరును నామినేట్ చేయకపోవడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చాడు. 'వాV్ా.. ఈ దేశం ఒక జోక్' అని బుధ వారం ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ప్రణరుకు సహచర ఆటగాడు పారుపల్లి కశ్యప్ మద్దతుగా నిలిచాడు. 2018లో కెరీర్ బెస్ట్ ఎనిమిదో ర్యాంక్కు చేరిన ప్రణరు.. ఆ ఏడాది మూడు టైటిల్స్ నెగ్గాడని, బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్కూ అర్హత సాధించాడని గుర్తు చేశాడు. ఇండోనేసియా ఓపెన్లో ప్రపంచ మాజీ నంబర్ లీ చాంగ్ వీ, ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్లపై వరుస సెట్లలో గెలిచాడని తెలిపాడు.
స్పోర్ట్స్ అవార్డుల దరఖాస్తులకు గడువు పొడిగింపు
స్పోర్ట్స్ అవార్డు దరఖాస్తుల గడువును క్రీడా మంత్రిత్వశాఖ పొడిగించింది. బుధవారంతో దరఖాస్తులకు ఆఖరిరోజు అయినప్పటికీ కోవిడ్-19 కారణంగా ఈ గడువును జూన్ 22వరకు పొడిగిస్తున్నట్లు బుధవారం తెలిపింది. వ్యక్తిగత నామినేషన్లకు ఇది వర్తిస్తుందని తెలియజేసింది.
ఖేల్రత్నకు జ్యోతి సురేఖ
క్రీడారంగ అత్యున్నత పురస్కారం 'రాజీవ్ గాంధీ ఖేల్రత్న' అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ పేరును రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. విజయవాడకు చెందిన 23 ఏళ్ల సురేఖకు 2017లో 'అర్జున' అవార్డు లభిం చింది. సురేఖ పదేళ్ల అంతర్జాతీ య కెరీర్లో భాగంగా ప్రపంచ, ఆసియా చాంపియన్షిప్, వరల్డ్ కప్లలో కలిపి 33 పతకాలను గెల్చింది. భారత ఆర్చరీ సమాఖ్య కాకుండా జ్యోతి సురేఖ పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడం విశేషం.
యతిమరపు రజని(హాకీ), అరుణ్ కుమార్, ఫర్హీన్ షేక్(రోలర్ స్కేటింగ్), ప్రియమ్(స్కేటింగ్)ను అర్జునకు, పి.పద్మజ బాల(కబడ్డీ కోచ్), పి.భాస్కర్ బాబు (బ్యాడ్మింటన్ కోచ్), పంచాడ సత్యనారాయణ (రోలర్ స్కేటింగ్) ద్రోణాచార్యకు, చింతా ప్రతాప్ కుమార్ (అథ్లెటిక్స్) పేరును ధ్యాన్చంద్ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది.