Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ప్రాక్టీస్కు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం
జొహనెస్బర్గ్ : క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) త్వరలోనే తమ క్రికెటర్లను మైదానాల్లోకి తీసుకురానుంది. అందుకోసం సీఎస్ఏ కీలక అనుమతులు పొందింది. దక్షిణాఫ్రికా క్రీడా మంత్రిత్వ శాఖ, ఆరోగ్య శాఖలు సీఎస్ఏకు ఈ మేరకు అనుమతులు మంజూరు చేశాయి. దీంతో మెన్స్, ఉమెన్స్ జట్లను వీలైనంత త్వరగా ప్రాక్టీస్లోకి దింపేందుకు సీఎస్ఏ కసరత్తులు చేస్తోంది. సెంచూరియన్లో ప్రీ సీజన్ క్యాంపులు నిర్వహించేందుకు యోచిస్తోంది. ప్రభుత్వ అనుమతులు లభించినా క్రికెట్ దక్షిణాఫ్రికా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 3టీసీఎం వెంటనే పట్టాలెక్కే అవకాశం లేదు. గత వారం 3టీసీఎం మ్యాచ్ను సీఎస్ఏ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జూన్ 27న సెంచూరియన్ సూపర్స్పోర్ట్ పార్క్లో 3టీసీఎం ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. సెంచూరియన్ దక్షిణాఫ్రికాలో కోవిడ్-19 హాట్స్పాట్. దీంతో ప్రభుత్వం నుంచి అనుమతులు లభించలేదు. దీనికి తోడు సీఎస్ఏ నిర్వహించిన కరోనా వైరస్ నిర్థారణ పరీక్షల్లో కొంతమంది పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఇది కూడా సీఎస్ఏ 3టీసీఎంను వాయిదా వేసేందుకు దోహదం చేసింది. తాజా అనుమతులతో దక్షిణాఫ్రికా క్రికెటర్లు జాతీయ శిక్షణ శిబిరంలో సాధన మొదలుపెట్టనున్నారు.